S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గ్యాంగ్స్టర్ నరుూం జీవిత కథ ఆధారంగా కట్టా రాంబాబు టైటిల్ రోల్ పోషిస్తూ నటిస్తున్న చిత్రం ‘ఖయ్యూం భాయ్’. భరత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సాయి ఊహ క్రియేషన్స్ పతాకంపై కట్టా శారద నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్లో విడుదలయ్యాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు సీడీని ఆవిష్కరించారు.
అల్లరి నరేష్, నిఖిలా విమల్ జంటగా జాహ్నవి ఫిలింస్ పతాకంపై జి.ప్రజీత్ దర్శకత్వంలో బొప్పన చంద్రశేఖర్ రూపొందిస్తున్న చిత్రం ‘మేడమీద అబ్బాయి’. ఈ చిత్రానికి సంబంధించిన ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తిచేశారు. దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ జయంతి సందర్భంగా శనివారం ఉదయం సినిమాకు సంబంధించిన ఫస్ట్లుక్ను విడుదల చేశారు.
నాని, నివేదా థామస్ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘నిన్నుకోరి’. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- మా బ్యానర్లో తెరకెక్కిస్తున్న ‘నిన్నుకోరి’ చిత్రం బాగా వచ్చింది. ముఖ్యంగా ఇటీవలే విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకుంది.
రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘పిఎస్వి గరుడవేగ 126.18ఎం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపు 33 రోజులపాటు జార్జియాలో చేశారు. భారతీయ చిత్రాల్లో ఇప్పటివరకూ వెండితెరపై కనిపించని పలు అందమైన లూకేషన్లలో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు తెలియజేశారు. యూరాషియన్ దేశంలో 33 రోజులపాటు షూటింగ్ చేశారు.
నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లై’. 14 రీల్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్గా మేఘా ఆకాష్ నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్లుక్తో ఆసక్తిని రేపిన ఈ చిత్రంలో నితిన్ కొత్త గెటప్లో కనిపించనున్నాడు. తాజాగా ఒక అందమైన ప్రేమను పరిచయం చేస్తున్నామంటూ, హీరోయిన్కు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. అమెరికాలో షూటింగ్ జరుపుతున్న ఈ చితం త్వరలో విడుదలకు సిద్ధమైంది.
టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఇమేజ్ తెచ్చుకున్న గోవా సుందరి ఇలియానాకు ప్రస్తుతం బాలీవుడ్లో పెద్దగా అవకాశాలు లేవు. సౌత్లో వున్న క్రేజ్ను కాదనుకొని బాలీవుడ్లో వెలగాలని తెగ ఆశపడి అక్కడికి వెళ్లింది. కానీ వచ్చిన రెండు మూడు అవకాశాలు కూడా ఈమెకు బాలీవుడ్లో నిలదొక్కుకునేందుకు ఉపయోగపడలేకపోయాయి. పోనీ గ్లామర్తో షాక్ ఇద్దామన్నా పలువురు భామలు ఆమెకంటే ముందే ఉన్నారు.
రామ్చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ శరవేగంగా సాగుతోంది. సినిమాకు సంబంధించిన టైటిల్పై ఎన్నో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ చిత్రానికి ‘రంగస్థలం’ పేరును ఖరారు చేశారు. 1985 అనేది ఈ సినిమాకు ఉపశీర్షిక. రామ్చరణ్- సుకుమార్ కాంబినేషన్ అనగానే ఎన్నో అంచనాలున్నాయి.
ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాధ్ జంటగా కొత్త చిత్రం హైదరాబాద్ ఫిల్మ్నగర్లో మొదలైంది. యుఎస్ ప్రొడక్షన్స్, విజయలక్ష్మి ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై విశ్వనాధ్ అరిగెల దర్శకత్వంలో ఉప్పలపాటి చరణ్తేజ్, గుర్రం విజయలక్ష్మి సంయుక్తంగా రూపొందిస్తున్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హీరో హీరోయిన్లపై క్లాప్నివ్వగా, ఉప్పలపాటి రామకృష్ణ, అనూరాధ సంయుక్తంగా కెమెరా స్విచ్చాన్ చేశారు.
అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో దిల్రాజు రూపొందిస్తున్న చిత్రం డిజె.. దువ్వాడ జగన్నాధమ్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 25వ చిత్రంగా రూపొందిన ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇటీవల థియేటర్ ట్రైలర్ విడుదలై రెండు రోజుల్లోనే పది మిలియన్ల వ్యూస్ పొందిందని నిర్మాత రాజు తెలియజేస్తున్నారు.
సెనే్సషనల్ కాంబినేషన్ నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ల నుంచి వస్తోన్న చిత్రానికి ‘పైసా వసూల్’ టైటిల్ ఖరారైంది. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి ఆనంద్ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమా టైటిల్, ఫస్ట్లుక్ను విడుదల చేశారు. దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ కథకు యాప్ట్ టైటిల్ పైసా వసూల్ అన్నారు.