S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అనీష్చంద్ర, పావని, ఆర్యన్, పూర్ణి ప్రధాన తారాగణంగా ప్లాన్ బి ఎంటర్టైన్మెంట్స్, శ్రేయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ధృవశేఖర్ దర్శకత్వంలో భరత్ అవ్వారి రూపొందించిన చిత్రం ‘లవర్స్ క్లబ్’. పక్కా యూత్ఫుల్ ఎమోషనల్ లవ్స్టోరీగా రూపొందిన సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని నిర్మాత చెప్పుకొచ్చారు. కొత్తవారైనా మెచ్యూరిటీతో నటించారని, దర్శకుడు వైవిధ్యంగా సినిమాను తెరకెక్కించారన్నారు.
బాహుబలి ఘన విజయంతో ఊపుమీదున్న ప్రభాస్, అదే స్పీడ్ని తన తరువాతి సినిమాకీ కొనసాగించే పనిలో ఉన్నాడు. సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం సుమారు 150 కోట్ల బడ్జెట్తో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే సాహో సినిమాలో ప్రభాస్కి జోడీగా ఇప్పటివరకు ఒక్క అమ్మాయిని కూడా ఫైనల్ చేయలేదు. మొన్న కత్రినా అన్నారు, ఇప్పుడు శ్రద్ధాకపూర్, దిశా పటాని అంటున్నారు.
సంపూర్ణేశ్ బాబు, గీత్షా జంటగా ఎస్ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఏఎన్ఎన్ ఫిలింస్ పతాకంపై సలీం ఎండి, శ్రీనివాస్ వంగాల నిర్మిస్తున్న చిత్రం వైరస్. నో వాక్సిన్.. వోన్లీ టాక్సిన్ ఉప శీర్షికతో తెరకెక్కుతున్న చిత్రంలోని పాటలు ఈనెల 20న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ హిలేరియస్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. ఇటీవల విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
విజయ్, కీర్తిసురేష్, జగపతిబాబు ప్రధాన తారాగణంగా పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై భరతన్ దర్శకత్వంలో బెల్లం రామకృష్ణారెడ్డి అందిస్తున్న చిత్రం ‘విజయభైరవ’. ఈ సినిమాకు సంబంధించిన తొలి కాపీ సిద్ధమైంది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.
దండుపాళ్యం చిత్రంతో దర్శకుడు శ్రీనివాసరాజు పొందిన గుర్తింపు సామాన్యమైనది కాదు. ఆ చిత్రం విజయవంతమైన నేపథ్యంలో ‘దండుపాళ్యం-2’ చిత్రాన్ని సీక్వెల్గా రూపొందించారు. వెంకట మూవీస్ పతాకంపై రూపొందించిన ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.
శ్యామ్, శ్రీకీర్తిక, సుమన్ ప్రధాన తారాగణంగా నవ్య మూవీ మేకర్స్ పతాకంపై తోట కృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నీలంపాటి అమ్మోరు’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్ అందుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
పిహెచ్ ప్రొడక్షన్స్ నిర్మించిన హారర్, ఫన్, లవ్ కానె్సప్ట్ సినిమా ‘టిక్ టాక్’. సినిమాకు హీరో, దర్శక నిర్మాత అయిన హరినాథ్ పొలిచర్ల మీడియాకు చెప్పిన విశేషాలు.
మానసిక తృప్తికి..
‘వైశాఖం’ పాటలు సీనియర్ దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రశంసలు అందుకున్నాయి. స్వయంగా వైశాఖం ఆఫీస్కు వచ్చిన పూరి, పాటలను తిలకించి యూనిట్ను అభినందించాడు. ఆర్జె సినిమాస్ పతాకంపై హరీశ్, అవంతిక జంటగా జయ బి దర్శకత్వంలో బిఎ రాజు నిర్మిస్తోన్న లవ్ కామెడీ ఎంటర్టైనర్ ‘వైశాఖం’.
సునీల్, మియాజార్జ్ జంటగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో యునైటెడ్ కిరీటీ మూవీ మేకర్స్ పతాకంపై పరుచూరి కిరీటి రూపొందించిన చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.
చిరంజీవి 150వ సినిమాతో మళ్లీ ఫామ్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఖైదీ నెంబర్ 150 ఏకంగా వంద కోట్లు స్పీడ్గా రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఆ ఊపుతోనే చిరంజీవి తన తరువాతి సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. చిరు 151వ చిత్రం ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కనుంది.