S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జగదేకవీరుడు, యమదొంగ వంటి చిత్రాలను రూపొందించిన కెమెరామెన్, దర్శకుడు శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. దర్శకుడు సాగర్కు ఆయన సోదరుడు. వౌళి క్రియేషన్స్ పతాకంపై కృష్ణతో జగదేకవీరుడు, అమ్మదొంగ వంటి చిత్రాలను నిర్మించారు.
మధుర శ్రీ్ధర్ దర్శకత్వంలో ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ‘ఎ ఫర్ అమెరికా’ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సుశీల్, సుజయ్ అనే ఇద్దరు దర్శకులు నిర్దేశకత్వం వహించనున్నారు. సుశీల్ చెప్పిన కథ అర్బన్ కామెడీ జోనర్లో అందరికీ నచ్చుతుందని ఈ సినిమా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా కోసం కొత్త నటీనటులను ఎంపిక చేయనున్నారు.
క్రేజీ దర్శకుడిగా టాలీవుడ్లో ఇమేజ్ తెచ్చుకున్న సుకుమార్ టాలీవుడ్లో టాప్ దర్శకుడిగా ఓ వైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే.. మరో వైపు తన అభిరుచికి తగ్గ సినిమాలను నిర్మించాలనే ఉద్దేశంతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. మొదటి ప్రయత్నంలోనే కుమారి 21ఎఫ్తో సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఆయన నిర్మాతగా రెండో సినిమాగా ‘దర్శకుడు’ అనే టైటిల్తో సినిమా ఆమధ్య మొదలై షూటింగ్ కూడా పూర్తికావచ్చింది.
గ్యాంగ్స్టర్ నరుూమ్ జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఖయ్యూమ్ భాయ్’. కట్టా రాంబాబు, తారకరత్న ప్రధాన తారాగణంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సాయి ఊహ క్రియేషన్స్ పతాకంపై కట్టా శారద చౌదరి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 90 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది.
తన నూరవ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో సూపర్ హిట్ అందుకున్నాడు బాలయ్య. ఆయన చెప్పినట్టు నిజంగా బాలయ్య శకం ప్రారంభం అయింది. ఇక ఆయన తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా? అనే సందేహాలు ఎక్కువయ్యాయి. బాలకృష్ణ వారసుడి ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ గురించి నిర్మాత సాయి కొర్రపాటి కన్ఫర్మ్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..
హాట్ హాట్ అందాలతో బుల్లితెరపై గ్లామర్ యాంకర్గా ఇమేజ్ తెచ్చుకున్న రష్మీకి ఈమధ్య సినిమా అవకాశాలు బాగానే వస్తున్నాయి. తాజాగా రష్మీకి ఓ ఐటెం సాంగ్ చేసే అవకాశం దక్కింది. రాజ్తరుణ్ హీరోగా నటిస్తున్న ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా కోసం ఓ ఐటెం సాంగ్ ప్లాన్ చేశారట.
సూర్య, శ్రుతిహాసన్, అనుష్క ప్రధాన తారాగణంగా స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో సుర ఎంటర్టైన్మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్ అందిస్తున్న చిత్రం సింగం-3 (యముడు-3). ఈ చిత్రాన్ని ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ..
చిత్రాలు.. ఫిల్మ్ఫేర్ ఉత్తమ చిత్రంగా ఎంపికైన దంగల్లో అమీర్ఖాన్
*ఉత్తమ దర్శకుడు నితీశ్ తివారీ (దంగల్)
*ఉత్తమ నటి అవార్డు అందుకున్న అలియా భట్
అశేష ప్రేక్షకాదరణ పొందిన బాలీవుడ్ చిత్రం దంగల్ మరో ఘనత సాధించింది. 62వ జియో ఫిల్మ్ఫేర్ అవార్డుల్లో ప్రధానమైన మూడు అవార్డులను కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. హర్యానాకు చెందిన మల్లయోధుడు మహావీర్సింగ్ ఫొగట్, అతడి ఇద్దరు తనయల జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘దంగల్’ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.
తెలుగుజాతి గౌరవాన్ని పెంచిన చిత్రం అంటూ యావత్ తెలుగు ప్రేక్షకులందరూ ఆదరిస్తున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక ప్రదర్శన ద్వారా వీక్షించారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో శనివారం ప్రదర్శించిన ఈ షోను చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఆయనతో కలిసి సినిమా చూశారు. సినిమా అనంతరం మీడియాతో తన మనసులోని మాటను పంచుకొన్నారు. ‘సినిమా అద్భుతంగా ఉంది.