-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: మన దేశంలో పర్యటిస్తున్న బ్రిటిష్ యువరాజు విలియమ్, ఆయన సతీమణి కేట్ మిడిల్టన్లకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి హైదరాబాద్ హౌస్లో విందు ఇచ్చారు. ఇండియా గేట్ పక్కన ఉన్న హైదరాబాద్ హౌస్ మెట్ల వద్ద ప్రధాని మోదీ యువరాజు దంపతులకు స్వయంగా స్వాగతం పలికారు. విందులో నాలుగు రకాల భారతీయ శాకాహార, మాంసాహార వంటకాలను వడ్డించారు.
‘పత్రికా రంగానికి చెందిన నన్ను పద్మ విభూషణ్తో సత్కరించి కేంద్రం పత్రిక స్వేచ్ఛ పట్ల తన నిబద్ధత చాటుకుంది. పత్రిక రంగం ప్రజాసేవకు అద్భుత వేదిక. నిబద్ధతతో పనిచేస్తూ పోతే గుర్తింపు దానంతటదే వస్తుంది’
- రామోజీ
‘హిందీ, తెలుగు భాషకు వారధిగా వ్యవహరిస్తాను. హిందీ భాషతో జాతీయ సమైక్యతకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి దక్కిన గౌరవం ఇది’
- యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
కొచ్చి/కొల్లాం, ఏప్రిల్ 12: కేరళలోని అన్ని దేవాలయాల్లో భారీ ధ్వనికారక బాణసంచా వినియోగంపై హైకోర్టు మంగళవారం నిషేధం విధించింది. కొల్లాంలోని పరువూర్ పుట్టింగల్ దేవి ఆలయంలో 110మంది ప్రాణాలను బలిగొన్న బాణసంచా పేలుడుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం, తీవ్రస్థాయిలో స్పందించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (నిట్)ను శ్రీనగర్నుంచి మార్చే ప్రసక్తి లేదని జమ్మూ,కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి దేశ రాజధాని ఢిల్లీ వచ్చిన మెహబూబా అంతకుముందు హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. కాగా, రాజ్నాథ్తో తన భేటీని ఆమె కేవలం మర్యాదపూర్వక భేటీగా అభివర్ణించారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఈ ఏడాది రుతుపవనాలు మామూలుకన్నా మించి ఉంటాయని, పుష్కలంగా వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ విభాగం మంగళవారం అంచనా వేసింది. వరసగా రెండేళ్లుగా వర్షాభావం కారణంగా వ్యవసాయ దిగుబడులు తగ్గిపోవడంతోపాటు వృద్ధి రేటు సైతం మందగించిన నేపథ్యంలో ఈ ఏడాది రుతుపవనాలు ఎలా ఉంటాయోనన్న భయాలు ఈ వార్తతో కొంతమేరకు తొలగిపోనున్నాయి.
నాగ్పూర్, ఏప్రిల్ 12: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒకేసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు మోదీ ప్రభుత్వం వంతపాడుతోందని, విద్యార్థుల్లో అశాంతి తీవ్రంగా పెరగడానికి ఇదే కారణమని వారు నిప్పులు చెరిగారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు మంగళవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పద్మ అవార్డులు ప్రదానం చేశారు. రాష్టప్రతి భవన్లో అట్టహాసంగా జరిగిన ఓ కార్యక్రమంలో పురస్కారాలు అందజేశారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: మిషన్ కాకతీయలాంటి పథకాలకు మహత్మాగాంధీ జాతీయ ఉపాధి కల్పన హామీ పథకం నిధుల వాటాను 60 శాతానికి పెంచాలని కేంద్ర జలవనరుల శాఖ ఉపసంఘం సిఫారసు చేసినట్టు తెలంగాణ నీటిపారుదల మంత్రి, ఉపసంఘం సభ్యుడు హరీశ్రావు వెల్లడించారు. పిఎంకెఎస్వైలో పది తెలంగాణ నీటి ప్రాజెక్టులు మొదటి ప్రాధాన్యత జాబితాలో, ఒక ప్రాజెక్టు రెండో జాబితాలో చేర్చారన్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న కరవు పరిస్థితులపై సుప్రీం కోర్టు మంగళవారం మరోసారి కేంద్రాన్ని నిలదీసింది. కరవుపై కేంద్రం స్వయంగా ఎందుకు చర్య తీసుకోవటం లేదని ప్రశ్నించింది. దేశమంతటా దారుణమైన పరిస్థితులు నెలకొని ఉంటే కేంద్రానికి ఎందుకు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: పూర్తిస్థాయి పింఛను పొందడానికి 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలనే నిబంధనను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో 2006కు ముందు రిటైరయిన పింఛనుదార్ల పింఛను పెరగనుంది. అంతేకాకుండా అప్పటినుంచి ఇప్పటివరకు పెరిగిన పింఛను బకాయిలు కూడా లభించనున్నాయి.