S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/24/2016 - 00:36

న్యూఢిల్లీ, జనవరి 23: పఠాన్‌కోట్ దాడికి సంబంధించి జాతీయ భద్రతా సంస్థ(ఎన్‌ఐఏ) గత కొన్ని రోజులుగా ప్రవ్నిస్తున్న పంజాబ్ పోలీసు ఉన్నతాధికారి సల్వీందర్ సింగ్‌కు ఆ సంస్థ క్లీన్‌చిట్ ఇచ్చింది. లైడిటెక్టర్ పరీక్ష, ఇతర పరీక్షల్లో ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లభించక పోవడంతో ఎన్‌ఐఏ ఆయనకు క్లీన్‌చిట్ ఇచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి.

01/24/2016 - 01:36

న్యూఢిల్లీ, జనవరి 23: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యంపై 70 ఏళ్లుగా వివాదం కొనసాగుతున్నప్పటికీ, 1945 ఆగస్టు 18న తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్టు 20 ఏళ్ల క్రితమే భారత్ ఒక నిర్ధారణకు వచ్చింది. ‘తాయ్‌హోకు (తైవాన్)లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించాడనే దానిలో అనుమానానికి ఎలాంటి తావూ లేదు. భారత ప్రభుత్వం ఈ వాదనను ఇప్పటికే అంగీకరించింది.

01/23/2016 - 13:57

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. గణతంత్ర వేడుకల్లో విధ్వంసానికి పాల్పడేందుకు ఐసిస్ వ్యూహరచన చేసినట్లు ఎన్ఐఏ‌కు వచ్చిన సమాచారం మేరకు శనివారం 6 నగరాల్లోని 12 చోట్ల సోదాలు నిర్వహించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు 13మంది అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

01/23/2016 - 13:29

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో చలితో పాటు పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీకి రావాల్సిన దాదాపు 30 రైళ్లు రద్దయ్యాయి. సుమారు 20 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమాన సర్వీసులలో ఆలస్యం లేదని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. పొగమంచు కారణంగా ఉదయం వాహనదారులు కూడా ఇబ్బంది పడ్డారు.

01/23/2016 - 13:25

న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కి సంబంధించిన రహస్య దస్త్రాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ విడుదల చేశారు. నేతాజి జయంతి సందర్భంగా రహస్య దస్త్రాల డిజిటల్‌ ప్రతులను ప్రధాని విడుదల చేశారు. కార్యక్రమంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

01/23/2016 - 13:02

కొచ్చి: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేరళ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ ఏసీ జోస్‌(79) కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం చికిత్స పొందుతూ మృతిచెందారు. జోస్‌ మృతిపట్ల పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

01/23/2016 - 12:44

న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈమేరకు ట్విట్ చేశారు. నేతాజీ దేశానికి చేసిన సేవలను, ధైర్యసాహసాలను కొనియాడారు. ధైర్యసాహసాలను, దేశభక్తిని భారతీయులంతా గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతోపాటు పలువురు నేతాజీకి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

01/23/2016 - 11:49

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ పరిశ్రమ ప్రాంతాల్లో శనివారం కూడా దట్టమైన పొగమంచు ఆవరించింది. దీంతో 30 రైళ్లను రద్దు చేశారు. 20 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు వల్ల రోడ్లపై ప్రయాణించేందుకు వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు.

01/23/2016 - 01:48

జాతీయ సాహస అవార్డుకు ఎంపికైన మెదక్ జిల్లా బాలిక ఎనిమిదేళ్ల రుచితకు
శుక్రవారం గిఫ్ట్ ప్యాకెట్‌ను అందిస్తున్న రాష్టప్రతి ప్రణబ్

01/23/2016 - 01:12

న్యూఢిల్లీ, జనవరి 22: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల్లో ఉగ్రవాదం, వాతావరణ మార్పు, స్మార్ట్ సిటీ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు రానున్నాయి. ఢిల్లీలోని ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకోయిస్ రిచిర్ శుక్రవారం ఇక్కడ ఈ విషయం చెప్పారు.

Pages