-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: దేశంలోని వివిధ ప్రాంతాల్లో విద్య నభ్యసిస్తున్న జమ్ముకశ్మీర్ విద్యార్థులు, ఉద్యోగులపై దాడులు చేయటం ఎంతమాత్రం మంచిది కాదు.. ఇలాంటి సంఘటనలను ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ప్రకటించారు. సింఘ్వి సోమవారం ఏఐసీసీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ జమ్ముకశ్మీర్ భారతదేశంలోని భూభాగం..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: పాకిస్తాన్తో చర్చల ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ తెగేసి చెప్పారు. పుల్వామాలో జరిగిన భయానక ఉగ్రదాడితో ఇక చర్చలకు ఎంత మాత్రం ఆస్కారం లేదన్న విషయం స్పష్టమైందని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించడం, దీనికి మద్దతునిస్తున్నవారిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం అన్నది ఈ జాడ్యాన్ని పెంపొందించడమే అవుతుందని మోదీ అన్నారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: కశ్మీర్లోని పుల్వామాలో నలభై మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న కారుబాంబు ఘాతుకానికి కుట్ర పన్నిన జైషే మహమ్మద్ ఇస్లామిక్ ఉగ్రవాది అబ్దుల్ రషీద్ ఘాజీ అలియాస్ కమరన్ను భద్రతా దళాలు సోమవారం మట్టుబెట్టాయి. సీఆర్పీఎఫ్ కాన్వాయిపై జరిగిన దాడిలో ఉపయోగించిన కారుబాంబును తయారు చేసిన హిలాల్ అహమద్ కూడా ఈ ఎన్కౌంటర్లో హతమయ్యాడు.
హజారిబాగ్ (ఝార్ఖండ్): సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ఎన్డీఏ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్ల కాలంలో ఝార్ఖండ్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఇక్కడ ఆయన పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించారు.
ఇండోర్, ఫిబ్రవరి 17: పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడితో దేశ ప్రజలు దిగ్భ్రాంతికి, కలవరానికి గురయ్యారని, అయితే నిరాశానిస్పృహలకు మాత్రం లోనుకాలేదని, ఎందుకంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం దాడికి కారణమయిన ద్రోహులను శిక్షించి తీరుతుందనే విశ్వాసం వారిలో ఉందని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు.
పుల్వామా ఉగ్రదాడిలో మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాను పంకజ్ కుమార్ త్రిపాఠీ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్. మహారాజ్గంజ్లో నివాసం ఉంటున్న ఆ కుటుంబానికి సాయంగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.
సోనిపట్, ఫిబ్రవరి 17: వ్యవసాయ క్షేత్రాల్లో పంటలు కోయగా మిగిలిన దుబ్బును నిర్వహించడంలో నూతన పద్ధతులు అనుసరిస్తున్న హర్యానా రైతులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభినందించారు. ఆ రైతుల్లో కొందరిని ఆయన ‘కిసాన్ రత్న’, ‘కృషి రత్న’ పురస్కారాలతో సత్కరించారు. అనేక రాష్ట్రాలలో రైతులు పంటలు కోయగా మిగిలిన దుబ్బును తగలబెడుతుండటం గత కొనే్నళ్లుగా వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలలో ఒకటిగా పరిణమించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఉపాధి రాహిత్యం, గ్రామీణ రుణ భారం పట్టణ ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం భారత యువతను నిరాశామయ దృష్టిలోకి నెట్టేస్తున్నాయని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఉపాధి లేని వృద్ధి పూర్తిగా ఉపాధి కోల్పోయే పరిస్థితికి దారితీసిందని, దీని ఫలితంగా యువతలో అనిశ్చితి నెలకొందని ఆయన అన్నారు.
లఖింపూర్ (అస్సాం), ఫిబ్రవరి 17: కేంద్రంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలో ఉన్నందున పుల్వామాలో జరిగిన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల త్యాగాలు వృథా కాబోవని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగా కాకుండా బీజేపీ భద్రతకు సంబంధించిన అన్ని అంశాలలో ఎలాంటి రాజీ ధోరణిని కనబరచదని ఆయన పేర్కొన్నారు.
ద హేగ్, ఫిబ్రవరి 17: కాశ్మీర్లోని పుల్వామా జిల్లా సంఘటనతో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాక్లో శిక్ష అనుభవిస్తున్న కులభూషణ్ జాదవ్ కేసు హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో సోమవారం నుంచి విచారణ ప్రారంభం కానుంది.