-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
చాంఫయ్ (మిజోరం), నవంబర్ 20: వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో తాము విజయం సాధించమన్న విషయం ఆర్ఎస్ఎస్, బీజేపీలకు బాగా తెలుసని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ అన్నారు. మిజోరం శాసనసభ ఎన్నికలను పురస్కరించుకుని మొదటిసారిగా ఇక్కడ జరిగిన సభలో మంగళవారం ఆయన మాట్లాడుతూ మిజోరం రాష్ట్ర సంస్కృతిని నాశనం చేయడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
న్యూఢిల్లీ, నవంబర్ 20: కార్యనిర్వహణ, న్యాయ వ్యవస్థ, చట్టసభలను మనందరం కలిసి బలోపేతం చేయాలని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పిలుపు ఇచ్చారు. ఈ మూడు వ్యవస్థలు బలహీనపడటం ఎంతమాత్రం మంచిది కాదు.. వీటిపట్ల ప్రజలు విశ్వాసం కోల్పోకూడదని అన్నారు. న్యాయమూర్తి వి.ఆర్.కృష్ణయ్యర్ జ్ఞాపకార్థం కాపిటల్ ఫౌండేషన్ నిర్వహించిన 104 జయంతి సభలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు.
న్యూఢిల్లీ, నవంబర్ 20: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై ఒక ఆగంతకుడు కారం పొడితో దాడి చేశాడు. హై సెక్యూరిటీ జోన్గా భావించే ఢిల్లీ సచివాలయంలో జరిగిన సంఘటనను ‘రాజకీయ ప్రేరేపిత దాడి’గా ఆప్ ఆరోపించింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయం నుంచి భోజనం నిమిత్తం బయటకు వస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై ఒక వ్యక్తి కారంపొడి చల్లి దాడి చేశాడు.
తిరువనంతపురం, నవంబర్ 20: శబరిమలలో ఉద్రిక్తత, అనిశ్చిత పరిస్థితులు ఏర్పడడానికి బీజేపీ, హిందూ సంస్థలే కారణమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతోమాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసమే శబరిమల అంశాన్ని వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. అయ్యప్ప ఆలయ ప్రవేశ అంశాన్ని పక్కదారిపట్టించేందుకు సంఘ్పరివార్ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.
కదల్లేకపోయినా ఓటు హక్కు వారిని కదిలించింది. ప్రజాస్వామ్యంలో వ్యవస్థను మార్చే శక్తి ఓటుకే ఉందన్న స్పృహ వృద్ధులను, దివ్యాంగులను పోలింగ్ కేంద్రాల బాట పట్టించింది. ప్రజాస్వామ్యానికి వెలుగునిచ్చే ఓటు హక్కును వీరు వదులుకోలేదు. ఆ స్పృహతోనే, పట్టుదలతోనే ఇలా చత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వస్తున్న దృశ్యాలు
మధ్యప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 230 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో రిజర్వుడు సీట్లు 82 ఉన్నాయి. వీటిల్లో 47 అసెంబ్లీ సీట్లను గిరిజనులకు, 35 సీట్లు ఎస్సీవర్గాలకు రిజర్వు చేశారు.
న్యూఢిల్లీ, నవంబర్ 20: కేంద్ర కేబినెట్లో సీనియర్ మంత్రి సుష్మాస్వరాజ్ మంగళవారం సంచలన ప్రకటన చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని వెల్లడించారు. అధికార బీజేపీలో ఉన్న సీనియర్ మంత్రుల్లో సుష్మా కూడా ఒకరు. ‘పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. నేను మాత్రం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను.
న్యూఢిల్లీ: ఎయిరిండియా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంతి సిన్హా వెల్లడించారు. దాదాపు 48,000 కోట్ల రుణభారంతో ఉన్న ఎయిరిండియాలో ప్రభుత్వ పెట్టుబడుల యోచనను విరమించుకున్నట్లు తెలిపారు. అలాగే ఈ సంస్థకు చెందిన నాలుగు అనుబంధ సంస్థలను అమ్మకానికి పెట్టినట్లు తెలిపారు.
పాట్నా: బీహార్ మాజీ మంత్రి మంజువర్మ ఎట్టకేలకు కోర్టులో లొంగిపోయారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ముజఫర్పూర్ షెల్టర్ అత్యాచారం కేసులో ఆయుధచట్టం కింద ఆమెను పోలీసులు అరెస్టు చేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నెలరోజులైనా పోలీసులు ఆమెను అరెస్టు చేయకపోవటంతో న్యాయస్థానం ఆగ్రహాం వ్యక్తంచేస్తూ అరెస్టు చేయని పక్షంలో ఈనెల 27న డీజీపీ ఎదుట హాజరు కావాలంటూ హుకుం జారీ చేసింది.
న్యూఢిల్లీ: గిరిజనులు ప్రాచీన పర్యావరణ వారసత్వాన్ని కాపాడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఆయన మంగళవారంనాడు మధ్యప్రదేశ్లోని జభువాలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ వాతావరణ మార్పులతో పోరాడే జీవన విధానాన్ని గిరిజనుల నుంచి నేర్చుకోవాలని సూచించారు. మోదీ రాబోయే కాలంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పరుచుకున్న లక్ష్యాలను వివరించారు.