కచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించాలి
Published Friday, 9 December 2016శ్రీకాకుళం, డిసెంబర్ 9: ప్రజాస్వామ్యవ్యవస్థలో కీలకమైన ఎన్నికల ప్రక్రియలో కచ్చితమైన ఓటర్ల జాబితా తయారీలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఓటర్ల జాబితా పరిశీలకుడు ఐ.శ్రీనివాసశ్రీనరేష్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం సమావేశమందిరంలో 2017 స్పెషల్ సమ్మరీ రివిజన్పై నిర్వహించిన సమావేశానికి ఆయన విచ్చేసారు. ఈ సందర్భంగా మట్లాడుతూ ఓటర్ల జాబితా తయారీ ఒక నిరంతర ప్రక్రియ అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకునే నిమిత్తం ముందుగా ఓటరుగా నమోదు కావాలన్నారు.