S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం

ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 9: మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో దశలవారీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని రంగాల్లో అభివృద్ది పర్చేందుకు కృషిచేయడం జరుగుతుందని చైర్‌పర్సన్ రంగినేని మనీషా అన్నారు. శుక్రవారం పట్టణంలోని 21, 3 వార్డుల్లో సిసి రోడ్డు, మురికి కాలువల పనులకు చైర్‌పర్సన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మనీషా మాట్లాడుతూ సిసి రోడ్డు నిర్మాణానికి రూ.2.5లక్షలు, మురికి కాలువల నిర్మాణానికి రూ.5లక్షల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. పట్టణంలోని అన్ని వార్డులో దళవారీగా అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టడం రుగుతుందన్నారు.

రైతులు నష్టపోకుండా ధాన్యాన్ని కొనేలా చూడాలి

మంచిర్యాల, డిసెంబర్ 9: రైతులు నష్టపోకుండా సన్నరకం వరి ధాన్యంను మిల్లర్లు కొనేలా అధికారులు శ్రద్ద చూపాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం సమావేశం మందిరంలో వరి ధాన్యం కొనుగోలుపై పౌర సరఫరాలు డీ ఆర్‌డీ ఓ, ఐకేపీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏ గ్రేడ్, బీ గ్రేడ్ వరి ధాన్యాన్ని ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసినందున ఆ రకం ధాన్యం పండించిన రైతులకు నష్టం కలగకుండా ఆయా శాఖల ద్వారా కొనుగోలు నిర్వహిస్తామన్నారు.

నిర్మల్‌లో పాలన అధ్వానం

మంచిర్యాల, డిసెంబర్ 9: మున్సిపల్ పాలక వర్గం పాలన అధ్వానంగా ఉందని అభివృద్ది పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని అధికార ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు మండి పడ్డారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఆవరణంలోని ఐకేపి భవనం నిర్వహించిన అత్యవసర సమావేశం చైర్‌పర్సన్ వసుంధర అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఏజెండాలోని అంశాలను చదివి వినిపించగా పాలక వర్గం సభ్యులంతా అనవసరమని తీర్మాణాలను చేపట్టడం సరికాదని అన్నారు. ఎల్ ఈడి బల్బుల ఏర్పాటు కొరకు నిర్ణయం తీసుకోగా కౌన్సిలర్ల తీర్మాణం అవసరమని చైర్ పర్సన్ వసుంధర పేర్కొన్నారు.

మాతాశిశు మరణాలు అరికట్టాలి

ఆసిఫాబాద్, డిసెంబర్ 9: మాతా శిశుమరణాలు అరికట్టేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కుమ్రం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వైద్య ఆరోగ్యశాఖ అధ్వర్యం లో గర్భిణీల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకం కింద గ్రామీణ మారుమూల ప్రాంతాల్లోని గర్భిణీలకు ప్రతి నెల 9వ తేదీన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, సురక్షిత కాన్పులు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

అవినీతి జాడ్యాన్ని పెకిలిద్దాం

ఆదిలాబాద్, డిసెంబర్ 9: దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి వ్యవస్థను కూకటివేళ్ళతో పెకిలించేలా ప్రతి ఒక్కరు అవినీతిరహిత సమాజం, దేశాభివృద్దికోసం భాగస్వాములుకావాలని కలెక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి పిలుపునిచ్చారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అవినీతి నిరోధక శాఖ అధ్వర్యంలో అవినీతి వ్యతిరేక వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

డిప్యూటీ స్పీకర్ కారుకు స్వల్ప ప్రమాదం

తూప్రాన్, డిసెంబర్ 9: డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి వాహనానికి స్వల్ప ప్రమాదం జరిగింది. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి శుక్రవారం ఉదయం చేగుంటలో ఓ వివాహానికి హాజరై హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైంది. మనోహరాబాద్ శివారులో ఆమె వెళ్తున్న వాహనానికి ముందుగా వెళ్తున్న తూప్రాన్ పోలీసుల ఎస్కార్ట్ వాహనానికి ఆకస్మికంగా ఓ ఆటో అడ్డు రావడంతో పోలీస్ వాహనానికి సడన్ బ్రేక్ వేశారు. దీంతో పద్మాదేవేందర్‌రెడ్డి వాహనం పోలీసు ఎస్కార్ట్ వాహనానికి ఢీకొంది. అలాగే డిప్యూటీ స్పీకర్ వాహనానికి వెనక ఉన్న మరో ఎస్కార్ట్ వాహనం పద్మాదేవేందర్‌రెడ్డి వాహనాన్ని ఢీకొట్టింది.

గోదావరి జలాలతో ఖేడ్‌కు కళ

నారాయణఖేడ్ డిసెంబర్ 9: నారాయణఖేడ్ నియోజకవర్గం వెనకబడి ఉందని, ఇందుకు కారణం గత పాలకులేనని తేలిందని, అందుకుగాను ఉప ఎన్నికలకు ముందు నుంచి ఖేడ్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామని ఉప ఎన్నికల్లో రైతులకు ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకున్నట్లు భారీ నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని వ్యవసాయా మార్కెట్ భవనంలో నూతన

కాంగ్రెస్ మెడలు వంచేంత దమ్ము కెటిఆర్‌కు ఉందా?

సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 9: కాంగ్రెస్ పార్టీ మెడలు వంచ్చేంత దమ్ము,్ధర్యం కెటిఆర్‌కు ఉందా? నీ వయస్సు ఎంత.. నీ రాజకీయ అనుభవమేంత? అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి (జగ్గారెడ్డి) ప్రశ్నించారు. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నామంటూ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను సంగారెడ్డిలో ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు నిర్మలాజగ్గారెడ్డి కేక్ కట్ చేసి సోనియాగాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ కోసం సోనియా త్యాగం అమోఘం

నర్సాపూర్,డిసెంబర్ 9: అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బర్త్‌డే సందర్భంగా శుక్రవారంనాడు కెక్ కట్ చేసి ఘనంగా జరుపుకొన్నారు. నర్సాపూర్‌లోని అంధుల పాఠశాల భవనంలో మాజీ మంత్రి, డిసిసి అధ్యక్షురాలు సునీతారెడ్డి ఆధ్వర్యంలో సోనియాగాంధీ బర్త్‌డేను ఘనంగా జరుపుకొన్నారు. ఈసందర్భంగా కెక్ కట్ చేసి అంధ విద్యార్థులకు పంచిపెట్టారు. ఈసందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ బర్త్‌డేను పురస్కరించుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ తీర్చిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు సోనియాగాంధీని ఎన్నటికి మరువలేరని అన్నారు. ఆమె త్యాగ ఫలితంగానే నేడు కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు.

ఎర్రవల్లి, నర్సన్నపేటలు పచ్చదనం పరచుకోవాలి

గజ్వేల్, ములుగు, డిసెంబర్ 9: ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలలో ఎక్కడ చూసినా చెట్లతో పచ్చగా, నిండుగా కనిపించాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఒఎస్టీ ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు. ఈ రెండు గ్రామాలలో హరితహారం క్రింద మొక్కలు నాటుతుండడాన్ని ఆమె శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డితో కలిసి పరిశీలించారు. ఎర్రవల్లిలో పూర్తయిన డబల్‌బెడ్రూం ఇళ్లను ఆనుకొని నాటిన మొక్కలను జాగ్రత్తగా చూడాలని, సిఎం కెసిఆర్ దత్తత గ్రామాలుగా నర్సన్నపేట, ఎర్రవల్లిలను గుర్తించిన విషయాన్ని అధికారులు ఎప్పుడూ మర్చిపోవద్దని స్పష్టం చేశారు.

Pages