పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం
Published Friday, 9 December 2016ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 9: మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో దశలవారీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని రంగాల్లో అభివృద్ది పర్చేందుకు కృషిచేయడం జరుగుతుందని చైర్పర్సన్ రంగినేని మనీషా అన్నారు. శుక్రవారం పట్టణంలోని 21, 3 వార్డుల్లో సిసి రోడ్డు, మురికి కాలువల పనులకు చైర్పర్సన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మనీషా మాట్లాడుతూ సిసి రోడ్డు నిర్మాణానికి రూ.2.5లక్షలు, మురికి కాలువల నిర్మాణానికి రూ.5లక్షల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. పట్టణంలోని అన్ని వార్డులో దళవారీగా అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టడం రుగుతుందన్నారు.