రైతాంగానికి ‘నగదు’ కష్టాలు!
Published Friday, 9 December 2016ఎర్రగుంట్ల,డిసెంబర్ 9: కేంద్రప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు గ్రామీణ రైతాంగాన్ని కరెన్సీ కష్టాల్లో ముంచింది. పట్టణ ప్రాంతాల్లో వ్యాపార లావాదేవీలతో ఎంతోకొంత నగదు దొరుకుతోంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో రైతు పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఆరుగాలం బావుల కింద ఎంతోకొంత పండించుకున్న పంటకు గిట్టుబాటుధరతోపాటు అసలు కొనే నాధుడే లేకపోవడంతో నగదు లావాదేవీలు జరగక నిత్యావసర వస్తువులకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఓ పెద్ద రైతు వద్ద ఎంతోకొంత చేతిబదులు తీసుకునే చిన్న, సన్నకారు రైతు పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా తయారైంది.