ఉత్తుత్తి విరాళాలు!
Published Saturday, 10 December 2016విశాఖపట్నం, డిసెంబర్ 9: ఆంధ్రా విశ్వవిద్యాలయం మహామహులు పట్టాలు పుచ్చుకున్నది ఇక్కడే. ఇక్కడ చదివిన ప్రముఖులు దేశ, విదేశాల్లో అత్యున్నత పదవుల్లో ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సహకారం లేక ఆర్థికంగా తవ్ర ఇబ్బందుల్లో ఉన్న విశ్వవిద్యాలయాన్ని ఉద్ధరించాలంటే ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థుల సహకారం కోరాలని నిర్ణయించారు. విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు కెసి రెడ్డి జయంతిని పురస్కరించుకుని యేటా డిసెంబర్ 10న పూర్వ విద్యార్థుల సమ్మేళనం (అలూమినా) నిర్వహించాలని తీర్మానించారు. దీనిలో భాగంగానే నిరుడు కాస్త ముందుగా నవంబర్ 12న పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.