నగదు రహిత చెల్లింపుల్లో.. రాష్ట్రం ముందడుగు
Published Wednesday, 7 December 2016విజయవాడ, డిసెంబర్ 6: నగదు రహిత చెల్లింపుల అమలులో దేశంలోనే ముందంజలో నిలిపి మన రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని సిద్ధార్థ ఫార్మాసిటికల్ కళాశాల సమావేశ మందిరంలో మంగళవారం కృష్ణా యూనివర్సిటీ అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్తో నగదు రహిత చెల్లింపులపై సమావేశం నిర్వహించారు.