S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగదు రహిత చెల్లింపుల్లో.. రాష్ట్రం ముందడుగు

విజయవాడ, డిసెంబర్ 6: నగదు రహిత చెల్లింపుల అమలులో దేశంలోనే ముందంజలో నిలిపి మన రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని సిద్ధార్థ ఫార్మాసిటికల్ కళాశాల సమావేశ మందిరంలో మంగళవారం కృష్ణా యూనివర్సిటీ అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో నగదు రహిత చెల్లింపులపై సమావేశం నిర్వహించారు.

అంబేద్కర్ స్ఫూర్తితో.. దళితుల అభ్యున్నతే ధ్యేయం

విజయవాడ, డిసెంబర్ 6: ‘నా జాతి ప్రజలకు కనీసం మానవ హక్కులను సాధించకపోతే నేను తుపాకీతో కాల్చుకుంటా’నని బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత జాతి హక్కుల కోసం అన్నారని సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంబేద్కర్ 60 వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. అంబేద్కర్ దళిత జాతుల హక్కుల కోసం మహద్ చెరువు నీళ్లతో తన పోరాటం మొదలు పెట్టారని చెప్పారు. ఇప్పటికీ దళితుల కోసం ఏర్పాటు చేసిన రిజర్వేషన్ ఫలాలు కొద్దిమందికే అందుతున్నాయని తెలిపారు.

మరో ఛాన్స్!

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 6: ఎపి సిఆర్‌డిఏ పరిధిలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం కింద నిర్ణీతకాలంలో రెగ్యులరైజ్ కాని దరఖాస్తుల క్లియరెన్స్‌కు మరో అవకాశం ఇస్తున్నట్టు కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ తెలిపారు. ఇంతకుముందు కొంత ఫీజులు చెల్లించిన, ఇంకా చెల్లించాల్సిన దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు 2017 ఫిబ్రవరి 28లోగా పరిష్కరించుకొనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇష్టంగా చేస్తే మ్యాథ్స్ పెద్ద కష్టం కాదు

పటమట, డిసెంబర్ 6: ఆంధ్ర లయోలా కళాశాలలో మంగళవారం డిగ్రీ విద్యార్థులకు అష్టావధానం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రఖ్యాత గణితవేత్త టిఎస్‌విఎస్ సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ గణితమంటే విద్యార్థులు భయపడతారని, అయితే గణితంను కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే పెద్ద కష్టం కాదన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో గణితం ముఖ్యభూమిక పోషిస్తుందన్నారు. పోటీ పరీక్షల్లో నెగ్గలాంటే గణితం చాల ముఖ్యమన్నారు. అనంతరం సమస్యపూరణం, వారగణం, దత్తాకం, నిషిద్దాంకం, మనసంకలనం, ఘనమూలం, ఆవృత దశాంశం, సరసప్రసంగం గురించి విద్యార్థులకు ఆయన వివరించారు.

ప్రభుత్వ హామీల అమలు సంతృప్తికరం

విజయవాడ, డిసెంబర్ 6: దేశంలోనే మన రాష్ట్రం 10.99 శాతంతో రెండంకెల వృద్ధి సాధించి మొదటిస్థానంలో నిలిచామని రాష్ట్ర విధాన మండలి హామీల కమిటీ చైర్మన్ గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. రెండు రోజులపాటు నగరంలోని సబ్ కలెక్టర్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన వివిధ ప్రభుత్వ శాఖల హామీలను కమిటీ సమీక్షించింది. వ్యవసాయం, ఎక్సైజ్, రెవెన్యూ, దేవాదాయ, ఆర్థిక, టూరిజం, విద్యాశాఖలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు జరిపిన విధానాన్ని సమీక్షించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో కమిటీ చైర్మన్ గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకున్న రుణాలలో రూ.

అందరికీ మార్గదర్శి అంబేద్కర్

విజయవాడ (రైల్వేస్టేషన్), డిసెంబర్ 6: నాడు డాక్టర్ అంబేద్కర్ ప్రవచించిన సిద్ధాంతాలే నేడు అమలవుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ అశోక్‌కుమార్ అన్నారు. రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లోని ఏసి ఆడిటోరియంలో విజయవాడ డివిజన్‌లోని పర్సనల్ బ్రాంచి విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 60వ వర్ధంతి మంగళవారం జరిగింది. ముఖ్యఅతిథిగా డిఆర్‌ఎం అశోక్‌కుమార్ ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేడు కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన నోట్ల మార్పిడి విధానం నాడు డాక్టర్ అంబేద్కర్ పదేళ్లకొకసారి అమలు చేయాలని చెప్పిందేనన్నారు.

రాజంపేట తెలుగుతమ్ముళ్లలో అంతర్గత విభేధాలు

కడప,డిసెంబర్ 6: రాష్టవ్య్రాప్తంగా త్వరలో జరగనున్న నగర పాలక, పురపాలక ఎన్నికల నేపధ్యంలో జిల్లాలో రాజంపేట పురపాలకానికి ఎన్నికలు జరగాల్సివుండగా అధికారపార్టీ నేతల్లో అంతర్గత విభేధాలు, మున్సిపల్ ఎన్నికల పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. రాజంపేటలో తొలి నుంచి ఏపార్టీలోనైనా కమ్మ, రెడ్ల సామాజిక వర్గాల మధ్యే పోరు ఉండేది. అయితే గత ఎన్నికల నుంచి కమ్మ, కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ టికెట్ లభించని కారణంగా కాపు సామాజికవర్గం కూడా ఒక గ్రూపుగా ఏర్పడింది.

అమర జవానుకు అశృ నివాళి

బద్వేలు, డిసెంబర్ 6: దేశ సేవలో అశువులుబాసిన బద్వేలు ప్రాంతానికి చెందిన కొత్తమద్ది చిన్నవెంకటసుబ్బయ్య మృతదేహం మంగళవారం బద్వేలుకు చేరుకుంది. సిఆర్‌పిఎఫ్ ఎఎస్సై డి.హనుమంతరావు నేతృత్వంలో ముగ్గురు జవాన్లతో కలిసి ప్రత్యేక వాహనంలో వెంకటసుబ్బయ్య మృతదేహాన్ని బద్వేలుకు తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహం వస్తుందన్న సమాచారం పట్టణంలో తెలియడంతో బంధువులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. వీరజవాన్ అమర్హ్రే అంటూ నినాదాలు చేశారు. మృతదేహాన్ని చూసిన భార్య ప్రసన్న, పిల్లలు, కుటుంబ సభ్యుల ఆర్థనాదాలు ఆకాశాన్నంటాయి.

ఫించన్ల కోసం వృద్ధుల అగచాట్లు..

రాజంపేట, డిసెంబర్ 6: నల్లధనాన్ని రూపుమాపేందుకు పెద్దనోట్ల రద్దును ఎవ్వరూ వ్యతిరేకించకపోయినా, ఈ పెద్దనోట్ల రద్దుతో జనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇప్పట్లో తీరేలా కనిపించడంలేదు. ముఖ్యంగా డిసెంబర్ మాసం మొదలైన మొదటివారంలో ఫించనుదారులు పడుతున్న అవస్థలు చెప్పనలవి కావడంలేదు. రూ.1000 వృద్ధాప్య ఫించన్ కోసం బ్యాంకుల్లో మరో రూ.1000 జమచేసే దుస్థితిని వృద్ధులు ఎదుర్కొనాల్సి వస్తుంది. వికలాంగులైతే రూ.రూ.1500 ఫించన్‌కు రూ.500 రూపాయలు జమచేసే దుస్థితిని ఎదుర్కొంటున్నారు.

ముగ్గురు అంతర్ రాష్ట్రాల మట్కాబీటర్ల అరెస్టు

కడప,డిసెంబర్ 6: అంతర్ రాష్ట్రాల మట్కాబీటర్లు ముగ్గురు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.47లక్షలు పైబడి నగదు, మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు కడప బిల్టప్, ఎర్రగుంట్ల బైపాస్, వీరపునాయునిపల్లె ప్రాంతాల్లో అంతర్ రాష్ట్రాల మట్కా బీటర్లు సంచరిస్తున్నారని మంగళవారం సమాచారం అందడంతో వారిపై దాడులు చేసి ప్రొద్దుటూరుకు చెందిన జాలాది నాగేశ్వరరావు(43), పబ్బతి రాఘవేంద్రప్రసాద్ (36), పబ్బతి సుధీర్‌బాబు (38) అనే ముగ్గురిని అరెస్టుచేసి వారి నుంచి రూ.47లక్షల 26వేల 900లు నగదు (పాతనోట్లు), మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Pages