జిల్లా వ్యాప్తంగా వర్షాలు..
Published Wednesday, 31 August 2016కర్నూలు సిటీ, ఆగస్టు 30:జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి దాదాపు 48 మండలాల్లో వర్షం కురిసింది. గత నెల రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో కళ్ల ముందే సాగు చేసిన పంటలు ఎండిపోతుంటే రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ తరుణంలో వర్షం కురవటంతో రైతులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 54 మండలాలకు గానూ నంద్యాలలో 162.4 మి.మీ, గోస్పాడు 162.4, మహానంది 110.6, చాగలమర్రి 92, కొలిమిగుండ్ల 80.2, పాణ్యం 77.2, పగిడ్యాల 67.4 మి.మీ వర్షపాతం నమోదయ్యాయి. అలాగే మరో 16 మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా, 15 మండలాల్లో సాధారణ వర్షపాతం, 10మండలాల్లో మోస్తరు వర్షపాతం నమోదయ్యాయి.