రొయ్యల రైతుల్ని కలవరపెడుతున్న వాతావరణంరొయ్యల రైతుల్ని కలవరపెడుతున్న వాతావరణం
Published Saturday, 11 June 2016నందివాడ, జూన్ 10: వాతావరణంలో చోటు చేసుకున్న పెను మార్పుల వల్ల రొయ్యల రైతులకు కంటి మీద కునుకు ఉండట్లేదు. శుక్రవారం ఈ విషయమై రొయ్యల సాగుపై రైతులు మాట్లాడారు. రోజంతా చల్లగా మబ్బులు పట్టి ఉండటం, ఎడతెరిపి లేకుండా చినుకులు పడుతుండడంతో చెరువుల్లో రొయ్యలకు ప్రాణ వాయువు సమస్య ఏర్పడిందన్నారు. అక్కడక్కడా చెరువుల్లో రొయ్యలు చనిపోతున్నాయన్నారు. మండలంలో సుమారు ఆరు వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోందని, ప్రస్తుత వాతావరణం చూసి నష్టాల భయంతో రైతులు తల్లడిల్లుతున్నామన్నారు. ఈ సంవత్సరం పంట కాల్వలు ద్వారా మంచినీటి సదుపాయం లేకపోయినా బోర్లు ద్వారా (ఉప్పు నీటి) రొయ్యల సాగు చేపట్టినట్టు చెప్పారు.