రూ.90 కోట్లతో ముద్దాడపేట వద్ద వంతెన
Published Saturday, 11 June 2016ఆమదాలవలస, జూన్ 10: మండలంలోగల ముద్దాడపేట గ్రామం వద్ద నాగావళి నదిపై సుమారు రూ.90కోట్లతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తున్నట్టు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు. నియోజకవర్గంలో పొందూరు, ఆమదాలవలస మండలాలను అనుసంధానం చేసి నాగావళి నదీ తీరంలో ఉన్న సుమారు 120 గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించేందుకు తాను ఈ ప్రతిపాదనలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.