కాపుమిత్ర చంద్రబాబు
Published Saturday, 11 June 2016మంగళగిరి, జూన్ 10: జగన్కు మేలు చేసే విధంగా వ్యవహరిస్తున్న కాపు సామాజిక వర్గీయులను సహించ వద్దని, న్యాయపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా కాపులను బీసీల్లో చేర్చేందుకే జస్టిస్ మంజునాథ కమిషన్ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏర్పాటు చేశారని, కాపు సామాజిక వర్గానికి మేలుచేసే మంచిపనిని ఓర్వలేక పక్కదారి పట్టించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కె కళావెంకట్రావు అన్నారు. మండల పరిధిలోని ఆత్మకూరులో గల హ్యాపీ రిసార్ట్స్ ప్రాంగణంలో శుక్రవారం అఖిల భారత కాపుసమాఖ్య ఆధ్వర్యాన నిర్వహించిన రాష్ట్ర కాపుసంఘాల సమాఖ్య ఆత్మీయ సదస్సులో కళావెంకట్రావు ప్రసంగించారు.