బంగారమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి
Published Wednesday, 8 June 2016శ్రీ కాళహస్తి, జూన్ 7: పట్టణంలోని బంగారమ్మ దేవతకు రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మంగళవారం ఉదయం పట్టువస్త్రాలు సమర్పించారు. జాతర సందర్భంగా శ్రీ కాళహస్తి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలను తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు, బోర్డు సభ్యులు, అనుబంధ ఆలయాల ఇన్చార్జ్ వెంకటస్వామి, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. జాతర ప్రారంభం సందర్భంగా పట్టణంలోని భక్తులేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. బుధవారం కూడా జాతర జరగనుంది.