హైటెన్షన్
Published Wednesday, 8 June 2016రాజమహేంద్రవరం, జూన్ 7: ఆకస్మిక ఉద్యమ నిర్ణయాలకు పెట్టింది పేరైన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి టెన్షన్ పుట్టించారు. గత రెండు రోజులుగా జిల్లాలో చర్చనీయాంశమైన తుని ఘటన అరెస్టుల నేపథ్యంలో మంగళవారం ముద్రగడ తనమార్కు ఉద్యమంతో ఉదయం నుండి సాయంత్రం వరకు పోలీసులకు చెమటలు పట్టించారు. ఒక విధంగా ముద్రగడ, పోలీసులు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ ముందుకుసాగారు. ఉదయం 8.30 గంటలకు అమలాపురంలో ప్రారంభమైన ఈ ఉద్యమం రాజమహేంద్రవరం మీదుగా కిర్లంపూడి చేరుకుని, రాత్రి 8 గంటలకు ముగిసింది. మొత్తంమీద సుమారు 12 గంటలు ముద్రగడ ఉద్యమం రాష్టవ్య్రాప్త కలకలం రేపింది.