సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం!
Published Tuesday, 7 June 2016విశాఖపట్నం, జూన్ 6: విద్యుత్ వినియోగదారులకు విశిష్ట సేవలందించే క్రమంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ సిఎండి’, స్పందన కార్యక్రమాలకు విశేష ఆదరణ లభిస్తోంది. ఎటువంటి జాప్యం లేకుండా సత్వర పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నందునే ఫలితాలొస్తున్నాయని సంస్థ భావిస్తోంది. ఇందులోభాగంగా సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు జరిగిన డయల్ యువర్ సిఎండిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన అనేకమంది వినియోగదారులు తమ సమస్యలను నేరుగా సంస్థ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ రేవు ముత్యాలరాజుకు విన్నవించుకున్నారు.