ఆందోళన వద్దు.. ఆదుకుంటాం
Published Tuesday, 7 June 2016న్యూఢిల్లీ, జూన్ 6: మొండి బకాయిల సమస్యతో సతమతమవుతున్న ప్రభుత్వరంగ బ్యాంకులకు బాసటగా నిలుస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం భరోసా ఇచ్చారు. నిరర్థక ఆస్తులు ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో గడచిన ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 12 ప్రభుత్వరంగ బ్యాంకులు నష్టాలపాలయ్యాయి. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో దేశీయ బ్యాంకింగ్ రంగంలోనే గరిష్ఠంగా 5 వేల కోట్ల రూపాయలకుపైగా నష్టాలను చవిచూసింది. ఈ 12 బ్యాంకులు ఈ జనవరి-మార్చిలో 24 వేల కోట్ల రూపాయలకుపైగా నష్టపోవడం గమనార్హం.