S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/28/2017 - 01:10

గాలే, జూలై 27: శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టుపై భారత్ పట్టుబిగించింది. మూడు వికెట్లకు 399 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు, గురువారం ఆటను కొనసాగించిన టీమిండియా 600 పరుగులకు ఆలౌటైంది. లంకలో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. ఆతర్వాత లంకను ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లకు 154 పరుగులకే కట్టడి చేసింది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని ఈ జట్టు ఇంకా 446 పరుగుల ఆధిక్యంలో ఉంది.

07/28/2017 - 01:07

న్యూఢిల్లీ జూలై 27: మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడినప్పటికీ, మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత క్రికెటర్లు కోట్లాది మంది మనసులను గెల్చుకున్నారని కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ అన్నారు. వరల్డ్ కప్ రన్నర్ ట్రోఫీతో స్వదేశానికి చేరుకున్న భారత మహిళా క్రికెటర్లను ఆయన గురువారం ఇక్కడ అట్టహాసంగా జరిగిన ఒక కార్యక్రమంలో సన్మానించారు.

07/28/2017 - 01:05

న్యూఢిల్లీ: ఎక్కువ సంఖ్యలో టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం ఉందని, అప్పుడే క్రికెటర్లలో ప్రమాణాలు పెరుగుతాయని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్కొంది. గురువారం ఇక్కడ జరిగిన సన్మాన కార్యక్రమానికి హారజైన ఆమె మాట్లాడుతూ వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లో భారత్ గొప్పగా రాణిస్తున్నదని అన్నది.

07/28/2017 - 01:05

న్యూఢిల్లీ, జూలై 27: భారత క్రికెట్ అంటే మహిళల జట్టే గుర్తుకొచ్చే రోజులు త్వరలోనే రానున్నాయని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. అసలు పురుషులు క్రికెట్ ఆడేవారా అనే ప్రశ్న భవిష్యత్తులో ఉదయించినా ఆశ్చర్యం లేదని చమత్కరించారు. ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత్ ద్వితీయ స్థానంలో నిలిచినప్పటికీ, దేశ ప్రజల మన్ననలు అందుకుందని తెలిపారు.

07/28/2017 - 01:03

న్యూఢిల్లీ, జూలై 27: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వ్యవహార శైలిపై ఆగ్రహంతో ఉన్న పాలనాధికారుల బృందం (సిఒఎ) గురువారం పాలక మండలి సభ్యులకు నోటీసులు జారీ చేసింది. బుధవారం జరిగిన ప్రత్యేక సమావేశం (ఎస్‌జిఎం)కు బిసిసిఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హోదాలో హాజరైన రాహుల్ జోహ్రీని బయటకు వెళ్లాల్సిందిగా తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అమితాబ్ చౌదరి ఆదేశించాడు.

07/28/2017 - 01:02

న్యూఢిల్లీ, జూలై 27: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన శివ థాపాసహా మొత్తం నలుగురు చెక్ రిపబ్లిక్‌లో జరుగుతున్న ఉస్టి నాడ్ లాబెమ్ గ్రాండ్ ప్రీ బాక్సింగ్ టోర్నీలో తమతమ విభాగాల్లో సెమీస్ చేరడం ద్వారా పతకాలు ఖాయం చేసుకున్నారు. థాపా 60 కిలోల విభాగంలో స్థానిక ఫేవరిట్ ఎరిక్ హులెవ్‌ను ఓడించి, సెమీస్‌లోకి అడుగుపెట్టాడు.

07/28/2017 - 01:01

కరాచీ, జూలై 27: ఇంగ్లాండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి టైటిల్ సాధించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టులోని ఆటగాళ్లు కోట్లకు పడగలెత్తారు. ప్రైజ్‌మనీగా లభించింది. సుమారు 23 కోట్ల రూపాయలను ఆటగాళ్లకు, మేనేజ్‌మెంట్‌కు పంచాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ముందుగానే నిర్ణయించింది.

07/28/2017 - 01:01

లాండోవర్ (మేరీలాండ్), జూలై 27: ఇంటర్నేషనల్ చాంపియన్స్ కప్ టోర్నమెంట్‌లో భాగంగా ఫెడెక్స్ ఫీల్డ్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి మాంచెస్టర్ యునైటెడ్‌ను బార్సిలోనా 1-0 తేడాతో ఓడించింది. ఆరంభం నుంచి చివరి వరకూ ఇరు జట్లు రక్షణాత్మక విధానాన్ని అనుసరించాయి. అయితే, నేమార్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కీలకమైన గోల్‌ను సాధించి జట్టును గెలిపించాడు.

07/27/2017 - 01:09

గాలే, జూలై 26: శ్రీలంకతో బుధవారం ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో భారత బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్, చటేశ్వర్ పుజారా శతకాలతో కదంతొక్కారు. వీరిద్దరూ లంక బౌలింగ్‌ను దుమ్మురేపారు. రెగ్యులర్ ఓపెనర్ మురళీ విజయ్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో, అతని స్థానంలో జట్టులోకి వచ్చిన ధావన్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 168 బంతుల్లోనే 190 పరుగులు చేశాడు.

07/27/2017 - 01:09

గాలే: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులను నిరాశ పరిచాడు. చాలాకాలంగా భారీ స్కోర్లు చేయలేకపోతున్న అతను ఇటీవలే లంక బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో 76 బంతులు ఎదుర్కొని 53 పరుగులు సాధించి, సహచరులకు బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను అందించేందుకు వీలుగా రిటైర్డ్ అవుటయ్యాడు. ఆ ఇన్నింగ్స్‌ను చూసిన తర్వాత అభిమానులు అతను మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని ఆనందించారు.

Pages