-
దుబాయ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20ల్లో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.
-
పెర్త్, డిసెంబర్ 12: న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి టెస్టు మొదటి రోజు ఆస్ట్ర
-
రావల్పిండి, డిసెంబర్ 12: రావల్పిం డిలో జరుగుతున్న పాక్-శ్రీలంక మొద టి టెస్టుక
-
హైదరాబాద్, డిసెంబర్ 12: రంజీ ట్రోఫీ 2019-20లో భాగంగా గుజరాత్తో జరుగుతున్న మ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
హైదరాబాద్, ఏప్రిల్ 23: హోం గ్రౌండ్లో శనివారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ను ఢీకొన్న సన్రైజర్స్ హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. రాజ్కోట్లో గుజరాత్ లయన్స్ను పది వికెట్ల తేడాతో చిత్తుచేసిన సన్రైజర్స్ అదే దూకుడును కొనసాగించింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరోసారి అర్ధ శతకంతో రాణించాడు. శిఖర్ ధావన్ అతనికి చక్కటి మద్దతునిచ్చాడు.
బెంగళూరు, ఏప్రిల్ 22: టీమిండియా పరిమత ఓవర్ల ఫార్మెట్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆధిపత్యాన్ని కనబరచాడు. ఐపిఎల్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో ధోనీ నాయకత్వం వహిస్తున్న రైజింగ్ పుణె సూపర్జెయింట్స్పై కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 13 పరుగుల తేడాతో గెలిచింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22:క్రికెట్లోప్రతి చిన్న అంశానికి కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించే ఆనవాయితీ పెరుగుతున్నది. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నకారణంగా మే ఒకటో తేదీ తర్వాత మహారాష్టల్రో జరగాల్సిన మ్యాచ్లను మరో ప్రాంతానికి తరలించాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ) సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో వరుసగా మూడో విజయంపై ఢిల్లీ డేర్డెవిల్స్ కనే్నసింది. మాజీ పేసర్ జహీర్ ఖాన్ నాయకత్వంలోని ఈ జట్టు తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ను ఎదుర్కొని పరాజయాన్ని చవిచూసింది. అయితే, ఓటమికి కుంగిపోకుండా, తర్వాత రెండు మ్యాచ్ల్లో వరుసగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లను ఓడించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: అనేకానేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి)కి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నుంచి కొంత ఊరట లభించింది. 2014లో భారత్ టూర్కు వచ్చిన విండీస్ జట్టు షెడ్యూల్ పూర్తికాక ముందు పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని స్వదేశానికి వెళ్లిపోయింది.
చాంగ్జూ (చైనా), ఏప్రిల్ 22: చైనా గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ సూపర్ సిరీస్ నుంచి భారత స్టార్లు పివి సింధు, హెచ్ఎస్ ప్రణయ్ నిష్క్రమించారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో పోర్న్టిప్ బురానప్రసెర్సుక్తో తలపడిన సింధు 17-21, 19-21 తేడాతో పరాజయాన్ని చవి చూసింది. రెండు సెట్లలోనూ సింధు చివరి వరకూ పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది.
దోహా, ఏప్రిల్ 22: భారత క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ ఇక్కడ జరుగుతున్న ఆసియా స్నూకర్ చాంపియన్షిప్లో సెమీ ఫైనల్కు దూసుకెళ్లాడు. సిరియాకు చెందిన కరమ్ ఫతిమాపై 3-1 ఫ్రేమ్స్తో సునాయాస విజయాన్ని అద్వానీ నమోదు చేశాడు. ఫైనల్లో స్థానం కోసం అతను క్రిసనట్ లెర్సాటయాథొర్న్ (్థయిలాండ్)తో తలపడతాడు.
హైదరాబాద్, ఏప్రిల్ 22: గుజరాత్ లయన్స్ను గురువారం జరిగిన మ్యాచ్ని పది వికెట్ల తేడాతో చిత్తుచేసిన సన్రైజర్స్ హైదరాబాద్ రెట్టించిన ఉత్సాహంతో శనివారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో పోరాటానికి సిద్ధమైంది. డేవిడ్ వార్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ, అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తుండగా, శిఖర్ ధావన్ మళ్లీ ఫామ్లోకి రావడం సన్రైజర్స్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నది.
మాడ్రిడ్, ఏప్రిల్ 21: స్పానిష్ సాకర్ లీగ్ ‘లా లిగా’లో భాగంగా గత ఐదు మ్యాచ్ల్లో నాలుగు పరాజయాలను చవిచూసిన బార్సిలోనా మళ్లీ ఫామ్లోకి వచ్చింది. డిపోర్టివో లా కొరునాతో జరిగిన మ్యాచ్లో ఈ జట్టు 8-0 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. లూయిస్ సౌరెజ్ ఏకంగా నాలుగు గోల్స్ సాధించగా, ఇవాన్ రాకిటిక్, లియోనెల్ మెస్సీ, మార్క్ బర్త్రా, నేమార్ తలా ఒక గోల్ చేశారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: రియో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించడం ద్వారా చరిత్ర సృష్టిస్తానని భారత మహిళా జిమ్నాస్ట్ దీప కర్మాకర్ ధీమా వ్యక్తం చేసింది. ఒలింపిక్స్కు ఎంపికైన తొలి మహిళా జిమ్నాస్ట్గా ఇప్పటికే రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన 22 ఏళ్ల దీప రియోలో క్వాలిఫయర్స్లో పాల్గొని స్వదేశానికి తిరిగి వచ్చింది.