S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/24/2018 - 13:46

విశాఖపట్నం: విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు సీఎంకు స్వాగతం పలికారు. అనంతరం విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు.

02/24/2018 - 13:29

హైదరాబాద్‌: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లి సమీపంలో రోడ్డుపై డీజిల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. ఇరవై వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకర్ శివరాంపల్లిలోని డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ట్యాంకర్ లోని డీజిల్ రోడ్డుపై లీక్ కావడంతో ఆందోళన చెందిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

02/24/2018 - 12:14

యాదాద్రి భువనగిరి: యాదాద్రిలోగల శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని చినజీయర్‌స్వామి, రామేశ్వరరావు శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను చినజీయర్ స్వామి పరిశీలించారు. కాగా... చిన్నజీయర్ స్వామికి ఆలయ అధికారులు సంప్రదాయాల ప్రకారం ఘనస్వాగతం పలికారు

02/24/2018 - 12:11

నాగర్‌కర్నూల్‌: జిల్లాలోని కేసరి సముద్రం చెరువుకట్టపై... మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి మార్నింగ్‌ వాక్ చేశారు. కేసరి చెరువు అభివృద్ధి పనులను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసరి సముద్రం చెరువును మినీ ట్యాంక్‌బండ్‌లా మారుస్తామన్నారు. చెరువు అభివృద్ధి పనుల కోసం రూ.10కోట్లు మంజూరు చేసామని తెలిపారు.

02/23/2018 - 16:51

అమరావతి: విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చనందునే తాము పోరాట పంథాను ఎంచుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నెల 27 నాటికి తాను రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు అవుతోందని... తన రాజకీయ జీవితంలో ఎన్నో చూశానని చెప్పారు. ఐదు నదులను అనుసంధానం చేసి, మహా సంగమాన్ని ఏర్పాటు చేస్తామని... ఇది సాకారమైతే రాష్ట్రంలో కరవు అనేది ఉండదని చెప్పారు.

02/23/2018 - 14:01

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో కిడ్నీ విభాగం సిల్వర్ జూబ్లీ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కిడ్నీ సమస్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నామని తెలిపారు.

02/23/2018 - 13:38

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు తగదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. జగన్ డైరెక్షన్‌లోనే సోము అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా పేరు మార్చి ప్యాకేజీ రూపంలో ఇస్తామన్నారని...పేరు ఏదైనా సాయం అందించాలనే తాము కోరుతున్నట్లు తెలిపారు.

02/23/2018 - 15:32

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ధర్మయుద్ధం జరుగుతుంది. హోదాతో ఒరిగేదేం లేదని, మనమే ఎక్కువ సాధించామని, ఏ రాష్ట్రానికైనా ఎక్కువ వచ్చాయా అని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఆ మాటలు ఏమయ్యాయని బీజేపీ ఎమ్మెల్సీ, సీనియర్‌ నేత సోము వీర్రాజు అన్నారు. ఒక్కసారిగా ఇప్పుడు చంద్రబాబు వైఖరిలో ఎందుకింత మార్పు వచ్చింది. హెదా ఇచ్చిన రాష్ట్రాల్లో అభివృద్ధి లేదని స్వయంగా చంద్రబాబే చెప్పారు.

02/23/2018 - 12:45

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఏడో రోజు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. నేడు జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో విశేష ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయి. శుక్రవారం రాత్రి శ్రీవారి ఎదుర్కోలు మహోత్సవం వైభవంగా నిర్వహిస్తారు.

02/23/2018 - 12:32

హైదరాబాద్: కేపీహెచ్‌బీ కాలనీ ప్రగతినగర్‌లో ఈ ఉదయం బంగారు గొలుసు చోరీ ఘటన చోటుచేసుకుంది. మహిళ మెడలోంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు మంగళసూత్రం గొలుసును లాక్కెళ్లిపోయారు. బాధితురాలు లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరా రికార్డుల ఆధారణంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Pages