-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, సెప్టెంబర్ 29: తెలంగాణ రాష్ట్రంలో 150 మంది ఎస్టి అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు గాను శుక్రవారం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించినట్లు వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను శాఖ అధికారిక వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 29: వరుసగా సెలవులు రావడంతో అక్టోబర్ ఒకటో తేదీన నిర్వహించాల్సిన సీనియర్ సిటిజన్ దినోత్సవాన్ని వచ్చేనెల రెండో వారానికి వాయిదా వేస్తున్నట్టు వికలాంగుల సంక్షేమ శాఖ సంచాలకులు శైలజ తెలిపారు.
నల్లగొండ, సెప్టెంబర్ 29: రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పెంపకం వృత్తిదారుల అభివృద్ధిని కాంక్షిస్తూ అమలు చేస్తున్న సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం బ్రోకర్ల జేబులు నింపే పథకంగా మారింది.
గద్వాల, సెప్టెంబర్ 29: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గత రెండు రోజులుగా వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో గేట్లన్నింటినీ మూసివేశారు. శుక్రవారం వరద ఉధృతి పెరగడంతో 7 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్టు జూరాల అధికారులు తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 29: ‘కత్తి, నెత్తి లేనోడు ఏదంటే అదే మాట్లాడుతాడు. దానికో లెక్కుందా? తాడు బొంగురం లేనివాళ్లు ఏదైనా మాట్లాడుతారు. ఆయనకేమైనా బాధ్యత ఉందా?’ అని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్పై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు తీవ్రంగా మండిపడ్డారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 29: హైదరాబాద్లోని చంచల్గూడ కేంద్ర కారాగారం నుంచి పారిపోయేందుకు యత్నించిన ఐసిస్ ఉగ్రవాదులను ప్రస్తుతం ఉన్న బ్యారక్ నుంచి మరో బ్యారక్కు మార్చారు. ఈ బ్యారక్లో ముగ్గురు ఉగ్రవాదులు విచారణ ఖైదీలుగా ఉన్నారు. వీరిని జైలు అధికారులు హై సెక్యూరిటీ బ్యారక్లో ఉంచారు. అయినప్పటికీ ఇటీవల వీరి బంధువులు ములాఖత్ కోసం వచ్చిన నేపథ్యంలో వారు తప్పించుకొని పారిపోయేందుకు యత్నించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 29: బంగారు తెలంగాణ పేరుతో ప్రజల వద్దకే పాలన తెస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్రాన్ని దశ, దిశ లేని విధంగా మార్చారని బిజెపి జాతీయ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 29: సింగరేణి కార్మికుల వారసత్వ ఉద్యోగాలపై కోర్టుకెళ్ళింది ‘తెలంగాణ జాగృతి సభ్యులే’నని అఖిలపక్ష నేతలు ప్రత్యారోపణ చేశారు. సింగరేణి ఎన్నికలు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుటుంబానికి, కార్మికులకు మధ్య జరుగుతున్న పోరు..అని వారు తెలిపారు. శుక్రవారం విలేఖరుల సమావేశంలో టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి, టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.
హైదరాబాద్, సెప్టెంబర్ 29: హజ్ యాత్రకు వెళ్లిన చివరి విమానం శుక్రవారం హైదరాబాద్ చేరుకుంది. దీంతో 2017 హజ్ యాత్ర ముగిసిందని తెలంగాణ హజ్ కమిటీ స్పెషల్ ఆఫీసర్ ప్రొ.ఎస్.ఏ.షుకూర్ తెలిపారు. 446 మంది హజ్ యాత్రీకులతో కూడిన చార్టర్డ్ ఫ్లయిట్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుందని ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ హజ్ సీజన్ మొత్తం 6347 మంది హజ్ యాత్రకు వెళ్లారని తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 29: భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరులను అవమానించడం సరికాదని, కంచె ఐలయ్యను రక్షించే పని పోలీసులది తప్ప తమది కాదంటూ మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించడం సరికాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. మంత్రి చేసిన ఈ ప్రకటన ఆయన బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోందని అన్నారు.