-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, నవంబర్ 13: ఆర్టీసీ సమ్మెపై ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు చేసిన సూచనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. సమ్మె అంశం కార్మిక శాఖ కమిషనర్కు అప్పగించాలని సూచించింది. దాంతో ఉభయ పక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్ను మాత్రం గురువారం నాడు విచారించనుంది.
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో ఈరోజు విచారణ కొనసాగింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్-2 ప్రకారం టీఎస్ ఆర్టీసీని ఏర్పాటుచేశామని, టీఎస్ ఆర్టీసీకి కేంద్రం అనుమతి అవసరం లేదని, ఆర్టీసీపై సర్వాధికారాలు రాష్ట్రప్రభుత్వానికి ఉన్నాయని ఏజీ వాదించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నప్పటికీ కేంద్రం అనుమతి అవసరమని అభిప్రాయపడింది.
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ జడ్జీలతో కమిటీ వేయాలని హైకోర్టు చేసిన సూచనకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని అడిషనల్ జనరల్ హైకోర్టుకు తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణలో ఉద్యమాలకు విలువలేకుండా పోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసినా ఆర్టీసీ సమ్మె పరిష్కారం కావటం లేదని, సమ్మె 32 రోజులు దాటినా ఎప్పటికీ పరిష్కారం జరుగుతుందో తెలియటం లేదని ఆయన విమర్శించారు.
భద్రాచలం: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కారును ఆర్టీసీ కార్మికులు అడ్డగించారు. సత్యవతి రాథోడ్ భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి దర్శనానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు మంత్రి కారు వెళ్లకుండా అడ్డంగా పడుకోవడంతో పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మంత్రి కారుకు అడ్డంగా ఉన్న కార్మికులను పోలీసులు ఈడ్చుకెళ్లారు.
మహబూబ్నగర్: మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో జరిగింది. హైకోర్టు తీర్పు ఎలా వస్తుందోనని మనస్తాపానికి గురైన ఆర్టీసీ కార్మికుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. 2007 నుంచి ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న ఆవుల నరేశ్ అనే కార్మికుడు ఈరోజు తెల్లవారుజామున పురుగుల మందు తాడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
మహబూబ్నగర్, నవంబర్ 12: కృష్ణా, తుంగభద్ర నదులకు కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. మంగళవారం కార్త్తీక పౌర్ణమి కావడంతో కృష్ణా, తుంగభద్ర నదులకు భక్తులు పోటెత్తారు. అందులో భాగంగా సోమశిల కృష్ణా సంగమం దగ్గర కార్తీక దీపాలను నదిలో వదిలేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అక్కడి సోమేశ్వరుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
కామారెడ్డి, నవంబర్ 12: కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండల పోలీసుస్టేషన్ ఎస్ఐ సస్పెండ్ అయ్యారు. ఠాణా ఆవరణలో అరెస్ట్ అయిన కొందరు నేతలు మద్యం సేవించడం, దానికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో, జిల్లా ఎస్పీ శే్వత ఈ సంఘటనపై విచారణ జరిపి మాచారెడ్డి ఎస్ఐ మురళీని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయ.
వనపర్తి, నవంబర్ 12: రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రైతులు గిట్టుబాటు ధర రాదనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హామీనిచ్చారు. మంగళవారం వనపర్తి వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
అమ్రాబాద్, నవంబర్ 12: నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని అటవీ భూ భాగంలో, గ్రామాలలో మంగళవారం సాయంత్రం జెట్ విమానం చక్కర్లు కొట్టడంతో అటవీ ప్రాంతంలోని ఆదిమజాతి చెంచులు, ఇతరు వర్గాలకు చెందిన ప్రజలు తీవ్ర భయందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతంలోని 83 చ.కిమీ పరిధిలో యురేనియం అనే్వషణ కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతులను మంజూరు చేసిన విషయం విదితమే.