క్రేజీ క్రేజీగా..!
Published Saturday, 8 April 2017చూడచక్కని లుక్తో అందరి హృదయాలను దోచుకుంటున్న భామ అనుపమ పరమేశ్వరన్ను ఒకటెనుక ఒకటి అవకాశాలు వరిస్తున్నాయి. వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుంటూ కెరీర్లో పరుగులు పెడుతూ క్రేజీ క్రేజీగా తన ఇమేజ్ని పెంచుకుంటోంది. తాజాగా రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమయింది. ఉగాది రోజు క్లాప్కొట్టిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. స్రవంతి మూవీస్, పి.ఆర్.మూవీస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో అనుపమది లలీ క్యారెక్టర్ అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటుంది అని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. ఇలా వరుస అవకాశాలతో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంటున్న అనుపమని కెరీర్ ఎలా అనిపిస్తుంది అని అడిగితే- ‘‘హాయి హాయిగా..వుంది. నన్ను, నా చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, ప్రోత్సహిస్తున్న పరిశ్రమకు నేనెంతో రుణపడి వున్నా’’అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.