మరో కేరళ ముద్దుగుమ్మ!
Published Saturday, 14 October 2017ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలను అందించే పూరీ జగన్నాథ్ తాజాగా తన కుమారుడితో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పూరీ ఆకాశ్ ఇప్పటికే కొన్ని సినిమాలు చేసారు. ఆంధ్రాపోరి చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. ఆకాశ్తో పూరీజగన్నాథ్ రూపొందిస్తున్న చిత్రం కోసం కథానాయికగా దాదాపు రెండు వందల మందిని పరిశీలించారు. ఆడిషన్లు నిర్వహించాక కేరళ ముద్దు గుమ్మ నేహాశెట్టి ఎంపికైందని టాలీవుడ్లో వినిపిస్తున్న వార్త. నేహా శెట్టి ముంగార్మేల్-2 చిత్రంతో మళయాళ రంగంలో హిట్ కొట్టింది. ప్రస్తుతం తెలుగుపై దృష్టి పెట్టిన ఈ అమ్మడికు పూరీ జగన్నాథ్ ఎటువంటి కెరీర్ ఇస్తాడో వేచి చూడాల్సిందే.