బాలీవుడ్పై గురి!
Published Saturday, 14 October 2017తెలుగు, తమిళ చిత్రాల్లో అగ్ర కథానాయికల్లో ఒకరుగా వెలుగొందుతున్న భామ నయనతార ఇక బాలీవుడ్పై గురిపెట్టింది. ఉత్తరాది భామలు దక్షిణాది చిత్రాలవైపు ఆసక్తి కనబరుస్తుంటే ఇక్కడి వాళ్లకు మాత్రం బాలీవుడ్పై మోజు తగ్గడం లేదు. ఈ విషయానే్న నయనతార మరోసారి నిజమేనని తేల్చేసింది. గతంలో చెప్పిన కొన్ని విషయాలను నయన అప్పుడే మరచిపోయినట్టుంది. తనకు సినిమాలే చాలు, వ్యాపార, వాణిజ్య ప్రకటనల్లో ఏ మాత్రం నటించేది లేదు అని స్టేట్మెంట్లు కూడా ఇచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు ఏకంగా చివరికి ఓ శాటిలైట్ సంస్థ ఆఫర్కు ప్లాట్ అయిపోయి దాని కోసం ప్రచార ప్రకటనలో జీవించేసింది. ఇదిలా వుండగా ఇప్పటి వరకు దక్షిణాది చిత్రాలు చాలు, ఉత్తరాదికి దూరం అంటూ వచ్చిన ఈ భామ తాజాగా బాలీవుడ్పై మోజు పెంచుకుంటోంది. దక్షిణాదిలో ముఖ్యంగా కోలీవుడ్లో టాప్ హీరోయిన్గా క్రేజ్ వున్న నయనతారకు చేతినిండా చిత్రాలున్నాయి. ఎప్పటికప్పుడు మరిన్ని అవకాశాలు తలుపుతడుతూనే వున్నాయి. అయినా తన స్టామినాను మరింత పెంచుకోవాలన్న ఆశతో హిందీ చిత్రాలపై కనే్నసింది. ఈ విషయం గురించి నయనను కదిలిస్తే- ‘‘అవును. మన పరిధిని విస్తృత పరచినప్పుడే మనమేంటో తెలుస్తుంది. నటి అన్నాక అన్ని భాషల్లో నటించాలి. అప్పుడే మనం మరింత వెలుగులోకి వస్తాం. అయితే నేనేం గతంలో ఇలా నటించను.. అలా నటించను అని చెప్పలేదు. అలాంటివన్నీ మీడియా కథనాలే. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మంచి ఇమేజ్ని సొంతం చేసుకున్న నాకు హిందీ చిత్రాల్లో కూడా నటించాలన్న ఆశ కలిగింది. ఆ ఆశే నన్ను బాలీవుడ్వైపు మొగ్గుచూపేలా చేస్తోంది. బాలీవుడ్లో కూడా నయనతార ఫవర్ చూపించాలనుకుంటున్నా’’అంటూ గట్టిగానే చెప్పుకొచ్చిందట. అదీ..సంగతీ!