S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వేణునాద విజయం(రాస క్రీడాతత్త్వము-7)

(iii) ఇంకా ఎందరెందరో జీవులు పూర్వజన్మలలో చేసుకున్న మహాతపస్సులవల్లా, తన వరాలవల్లా, ఈ నాడు తన దగ్గర గోపికలై జన్మించి వున్నారు. (ఈ విషయాలు గర్గసంహిత, బ్రహ్మవైవర్త పురాణం, వంటి గ్రంథాలలో వున్నాయి)
(iv) వీరిలో కొందరు కన్యలున్నారు. వారు తనను భర్తగా పొందాలని కాత్యాయనీవ్రతం చేసి వున్నారు. ఒక రాత్రి క్రీడిస్తానని వారికి తనే వరం ఇచ్చి వున్నాడు.
v) వారిలో కొందరు యువతులు, మరి కొందరు పిల్లల తల్లులు, రక రకాల వయసుల వాళ్ళున్నారు.
వీళ్ళందరూ ఉపాసన చేస్తున్నామనే జ్ఞానం లేకుండానే తనను గురించి గొప్ప ఉపాసన చేస్తున్నారు. వీరందరికీ ఈ నాటి మానవ దేహాలతోనూ, మానవ కుటుంబాలతోనూ, ఒక ప్రక్క బంధం పెరిగిపోతోంది. మరొక ప్రక్క అవ్యాజమైన ఉపాసన జరిగిపోతోంది.
వీరందరినీ ఉద్ధరించేదెలా? వీరికి లోకబంధాల మీద దృష్టి పడకుండా, పరమాత్మదృష్టి సర్వకాల సర్వావస్థల లోనూ ఒకే విధంగా నిలబడి వుండేటట్లు చెయ్యటమెలా?
అలా చెయ్యాలంటే-వీరిని పరీక్షించాలి. వీరిలో తన దివ్యత్త్వాన్ని గుర్తుపట్టిన వారెందరు? కేవలం తన సమ్మోహన శక్తివల్ల వెంటపడుతున్నవారెందరు?
వీరిలో యోగ్యులైనవారికి మన్మధ భావాలను తొలగించేదెలా? పరమాత్మ తాదాత్మ్యస్థితికి చేర్చేదెలా?
శ్రీకృష్ణుడు ఈ సమస్యలన్నీ ఆలోచించుకుని, ఒకానొక శరత్కాల పూర్ణిమరాత్రి నాడు, రాత్రి మొదటి జాములోనే యమునా తీరానికి వెళ్ళి, జగన్మోహనంగా మురళీగానం ప్రారంభించాడు.
ఆ గానంలో కామరాజ బీజమైన క్లీంకారాన్ని జోడించాడని వేదవ్యాసుడు నిగూఢంగా చెప్పాడు. అక్కడి శ్లోకంలో
‘‘జగౌ కలం వామదృశాం మనోహరం’’ (10స్కం- 29అధ్యా-3శ్లో) (స్ర్తిలను హృదయాలను ఆకర్షించేలాగా గానం చేశాడు) అని వుంది. ఇక్కడ ‘‘కలం’’ అనే పదం క్లీంకారానికి సంకేతమేనని వ్యాఖ్యాతలు నిర్ణయించారు. ఇలాంటి సంకేతాలను వాడటం వేదంలో గూడా వుంది.
ఈ భావాలను మనస్సులో పెట్టుకునే లీలాశుక మహాకవి శిశువైన శ్రీకృష్ణుడి వేణుగానాన్ని ఇలా వర్ణించాడు.
లోకానున్మదయన్ శ్రుతీర్ముఖరయన్ క్షోణీరుహాన్ హర్షయన్
శైలా న్విద్రవయన్ మృగాన్వివశయన్ గోబృంద మానందయన్
గోపాన్ సంభ్రమయన్ మునీన్ ముకుళయన్ సప్తస్వరాన్ జృంభయన్
ఓంకారార్థ ముదీరయన్ విజయతే వంశీనినాద శ్శిశోః ॥
(శ్రీకృష్ణ కర్ణామృతము, శ్లో-110)
(్భవం : బాలకృష్ణుడు మురళి ఊదుతుంటే, ఆ నాదం లోకులకు పిచ్చెక్కిస్తోంది. వేదాలను మరుమ్రోగిస్తోంది. చెట్లను సంతోషపెడుతోంది. కొండలను కరిగిస్తోంది. జంతువులను పరవశింపజేస్తోంది. గోవుల బృందాలను ఆనందింపజేస్తోంది. గోపాలకులను తత్తరపరుస్తోంది. మునులకు విబనులు మూయిస్తోంది. సప్తస్వరాలను విజృంభింపజేస్తోంది. ఓంకారార్థాన్ని పలుకుతోంది. ఆ విధంగా ఆ స్వామి వేణునాదం సర్వలోకాల మీదా విజయం సాధిస్తోంది.)
గోపికల ప్రతిస్పందన :-
అలా ఆ వేణుగాన నాదాలు బృందావనాన్నీ, చుట్టుప్రక్కల గల వ్రజగ్రామాల్నీ, వెనె్నలతో సమానంగా అల్లుకుని చుట్టుకోసాగాయి. కానీ, చిత్రమేమంటే ఆయా గ్రామాలలో గల గోపికలలో ఎవరెవరు పరమాత్మ యెడల పరమ విరహభక్తి రూపమైన భక్తిని పూర్వ జన్మలలోనూ, ఈ జన్మలలోనూ కూడా ఆచరిస్తున్నారో, అలాంటివారికి మాత్రమే ఈ గానాలు చెవుల ద్వారా హృదయాలలోకి విరహభక్తి మార్గంలో ఆ స్వామిని ఉపాసన చేస్తున్న జీవుల విషయంలో మాత్రం ఈ నాదాలకు చేతులొచ్చి, వారి హృదయాలను కవ్వం చిలికినట్టు చిలికి, వారి ప్రాణాలను అతలాకుతలం చేశాయి. మధురాతి మధురంగా వున్న ఆ ప్రాణాంతక సన్నివేశాన్ని ఆ గొల్ల మహిళలు తట్టుకోలేక, అదేమిటో అర్థం కాక, ప్రాణాలూ, దేహాలూ, తమ వశంలో లేక, అది ఆనందమో, బాధో, తెలియని విచిత్రావస్థలో పడ్డారు.
కొందరు జీవులకు తమలో కలిగేది మన్మధవికారమేమో అనిపించింది.
మరి కొందరికి నాదోపాసనేమో అనిపించింది. మరి కొందరికి పిచ్చేమోననిపించింది. మరి కొందరికి మనసు పనిచేయటం మానేసింది.
(ఇంకా వుంది)

- కుప్పా వేంకట కృష్ణమూర్తి.. 9866330060