S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పని ఒత్తిడా!?

‘‘పనిభారం ప్రాణాలు తీస్తోంది’’ 2 అని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జెఫ్రీ పెప్ఫర్ అంటున్నారు. ఆయన చెబుతున్న మాటలు అతిశయోక్తి కాదు. ఆధునిక ఉద్యోగ జీవితంలో సుదీర్ఘ పనివేళలు, ఉద్యోగం-కుటుంబ జీవితాల మధ్య సంఘర్షణ, ఆర్థికపరమైన అభద్రత అన్నీ.. ఉద్యోగుల జీవితాలను మానసికంగా, శారీరకంగా ధ్వంసం చేస్తున్నాయని జెఫ్రీ చెబుతున్నారు. ఈ అంశాలన్నింటినీ తన తాజా పుస్తకం 3‘‘డయ్యింగ్ ఫర్ ఎ పే ఛెక్’’ లో ప్రస్తావించారు.
సంస్థాగత సిద్ధాంతం, మానవ వనరుల నిర్వహణ అంశాల్లో ఇప్పటిదాకా ఆయన పదిహేను పుస్తకాలు రాశారు. వీటిలో కొన్ని రచనలను ఇతరులతో కలిసి రచించారు. వర్తమాన కాలంలో ఈయన అత్యంత ప్రభావశీలమైన వ్యక్తిగా చాలామంది అభివర్ణిస్తారు.
టోక్యోలో, ఆఫీసులో పనిచేస్తూ, గుండెపోటుతో మరణించిన 42 ఏళ్ల జపాన్ వ్యక్తి కెన్జీ హమాదా గురించి జెఫ్రీ ఈ తాజా పుస్తకంలో ప్రస్తావించారు. కెన్జీ ఇంటి నుంచి ఆఫీసుకు రావడానికి దాదాపు రెండు గంటలు ప్రయాణించాలి. ఆయన పనిగంటలు వారానికి 75. ఆయన చనిపోవడానికి ముందు వరుసగా 40 రోజులపాటు పనిచేశాడు. ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఎన్నో జెఫ్రీ పుస్తకంలో ఉన్నాయి. ఈ వైఖరిని ఆయన 3అమానవీయం2 అంటారు. ఇలాంటి సంఘటనలు కేవలం జపాన్‌కు మాత్రమే పరిమితం కాలేదు. జెఫ్రీ అధ్యయనం ప్రకారం అమెరికా ఉద్యోగుల్లో 61 శాతం మంది కుంగుబాటు తమ ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని విశ్వసిస్తుంటే, ఏడు శాతం మంది మాత్రం ఉద్యోగానికి సంబంధించిన అంశాల వల్ల తాము ఆసుపత్రి పాలయ్యామని చెబుతున్నారు. ఉద్యోగం వల్ల కలిగే ఒత్తిడి కారణంగా అమెరికాలో ఏటా 1.2 లక్షల మంది చనిపోతున్నారని జెఫ్రీ అంచనా.
పనిభారం.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందనడానికి ఆధారాలు ఉన్నాయి. సుదీర్ఘ పనివేళలు, పనిభారం పెరగడం, ఉద్యోగులకు ఆరోగ్య భద్రత లేకపోవడం ఒత్తిడికి లోనవ్వడం వల్ల ఆర్థికపరమైన అభద్రత కూడా ఉద్యోగులను కమ్మేస్తుంది. ఈ మధ్యలో కుటుంబంలో గొడవలు, అనారోగ్యం. పని అన్నది అమానవీయంగా మారింది. ఒకవైపు.. ఉద్యోగులకు సంబంధించిన బాధ్యతల నుంచి యాజమాన్యం తప్పుకుంటోంది. మరోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగవ్యవస్థ వల్ల ఉద్యోగుల్లో అభద్రతాభావం పెరుగుతోంది అన్నారు. ఇంకా ఈ విషయంపై సమగ్రంగా మాట్లాడుతూ..
50-60 దశకాల్లో.. ఉద్యోగులకు, క్లైంట్స్‌కు, వాటాదారులకు మధ్య సమన్వయం అవసరమని యజమానులు భావించేవారు. కానీ ప్రస్తుతం యాజమాన్యం దృష్టి మొత్తం వాటాదారులపైనే ఉంది. కొంతమంది ఉద్యోగులు కేవలం స్నానం చేయడానికి మాత్రమే ఇళ్లకు వెళుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి కదా.. ఆ స్నానాలు ముగించాక మళ్లీ ఆఫీసుకు పరుగు! ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉద్యోగులు డ్రగ్స్‌కు బానిసలు అవుతున్నారు. అలసిపోయినప్పుడు నిద్రపోకుండా మెలకువగా ఉండటానికి కొకైన్‌తో పాటు మరికొన్ని రకాల డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారు. ఫాక్టరీల్లో కార్మికులు, పైలెట్స్, ట్రక్ డ్రైవర్లుకు నిర్దిష్ట పనివేళలు ఉంటాయి. కానీ చాలా ఉద్యోగాల్లో పనివేళలకు హద్దు ఉండదు.
మరణాలకు కారణమయ్యే అంశాల్లో ఉద్యోగం ఐదవది అని ఆయన రాసిన పుస్తకంలో జెఫ్రీ అన్నారు. ఈ విషయం గురించి ప్రశ్నించినప్పుడు ఐదవది కాదు.. అంతకు మించి కూడా కావొచ్చు అన్నారు. యజమానులు అంతా చూస్తూ ఏమీ చేయకుండా వౌనంగా ఉన్న ప్రభుత్వాలు ఇందుకు బాధ్యత వహించాలని కూడా ఆయన అన్నారు. ఇందులో రాజకీయాలది కూడా కీలకపాత్రే.. ఈ పరిస్థితిని ఆపడానికి మనం ఏదో ఒకటి చేయాలి. ఒక వ్యక్తిగా మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఒక వ్యవస్థలో ఏదైనా మార్చాలనుకుంటే వ్యవస్థీకృతమైన విధానం ఉండాలి. ఇది జరగాలంటే నియమాలు, నిబంధనలు మారాలి. ఈ విషయాన్ని యాజమాన్యాలతో ప్రస్తావించినప్పుడు అందరూ వింటారు కానీ ఎలాంటి ప్రయత్నం చేయరు. పని ఒత్తిడి వల్ల ఉద్యోగులకు డయాబెటిస్, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక రోగాలు వస్తున్నా యాజమాన్యాలు మాత్రం స్పందించడం లేదు. కార్మిక వ్యవస్థలో మార్పులు వస్తే ఆ ప్రభావం కార్పొరేట్ లాభాలపై ఉంటుందని వ్యాపారులు భావించడంలో అర్థం లేదు. అది నిజం కాదు. తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న ఉద్యోగులు రాజీనామా చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అనారోగ్యంగా ఉన్న ఉద్యోగుల్లో మానసికంగా, శారీరకంగా ఉత్పాదక శక్తి తక్కువగా ఉంటుంది. ఉత్పాదకత తక్కువగా ఉన్నప్పుడు, ఆ ప్రభావం కంపెనీ లాభాలపై పడుతుంది. ఉద్యోగులు తమ ఆరోగ్యం గురించి తామే బాధ్యత తీసుకోవాలి. ఉద్యోగ జీవితం, కుటుంబ జీవితాల మధ్య సమన్వయం కుదరని ఉద్యోగాలను వదిలేయాలి. కొందరు.. 3‘‘మేం ఉద్యోగాలను అంత సులభంగా వదల్లేం’’2 అని సమాధానం ఇస్తారు. వారికి ఒకటే నివేదన.. 3‘‘పొగ కమ్ముకుని ఊపిరాడని గదిలో మీరు చిక్కుకున్నప్పుడు మీరు వెంటనే ఆ గది నుంచి బయటపడాలి. లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చట్టం, తమ హక్కుల గురించి ప్రజలు డిమాండ్ చేయాలి. కలిసికట్టుగా ముందుకు కదలాలి. లేకపోతే నష్టపోయేది మన సమాజమే’’2 అంటాడు జెఫ్రీ. -

-మహి