నటనపై శ్రద్ధలేదు..!
Published Saturday, 21 May 2016ప్రస్తుతం చాలా మంది తారలు గ్లామర్ను కాపాడుకోవడానికి చూపిస్తున్న శ్రద్ధ నటనపై పెట్టడం లేదని బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ అంటోంది. అంతేకాదు, నేటి తారలు జీరోసైజ్, సిక్స్ప్యాక్ల వెంట పరుగులు తీస్తూ కెరీర్ను నాశనం చేసుకుంటున్నారని కూడా వాపోయింది. పెళ్లి తర్వాత అభినయానికి ఆస్కారం వున్న పాత్రలకు ప్రాధాన్యతనిస్తోంది ఈ అమ్మడు. మహిళా ప్రధాన చిత్రాలు, విలక్షణ కథాంశాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ‘‘గ్లామర్ లుక్ విషయంలో తారలపై ఒత్తిడి పెరిగుతోంది. కథ, పాత్రల గురించి ఆలోచించాల్సిన వారు శారీరక తీరుపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. వారి దృష్టి నటన నుంచి గ్లామర్పైనే ఎక్కువగా కేంద్రీకృతమవుతోంది. ఈ విషయంలో తారల్లో మార్పు రావలసిన అవసరం వుంది’’అంటూ సెలవిచ్చింది కరీనాకపూర్. నిజమే.. తారలు ఇకనైనా మారుతారంటారా?! ఏమో..చూద్దాం..!!