కందిపప్పు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
Published Friday, 22 July 2016ముకరంపుర (కరీంనగర్), జూలై 21: మార్కెట్లో కందిపప్పు ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం పక్షాన ఏర్పాటు చేసిన కందిపప్పు కేంద్రాలను కందిపప్పు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన ప్రజలకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని రైతుబజార్లో మేయర్తో కలిసి కందిపప్పు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వినియోగదారులకు అందుబాటులో ఉండేవిధంగా జిల్లా కేంద్రంలోని రైతు బజార్లలో కందిపప్పు కిలో 120 రూపాయలకు అందిస్తున్నామన్నారు. కాశ్మీర్ గడ్డలోని రైతుబజార్, గాంధీరోడ్లోని రైతుబజార్, ప్రకాషం గంజ్లోని శ్రీనివాస ఎంటర్ప్రైజెస్, తిరుమల ట్రేడర్స్, జగదీష్ ట్రేడర్స్, సదానందం కిరాణం, సిక్వాడీలోని గాయత్రీ కిరణాల్లో అందుబాటులో ఉంటుందని జిల్లా ప్రజలు గమనించాలని తెలిపారు.