తిరుపతిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ
Published Friday, 22 July 2016తిరుపతి, జూలై 21: నగర పాలక సంస్థ పరిధిలోని 37,39 వార్డులలో తాగునీటి పైప్లైన్ను, యుడిఎస్ లైను, శ్మశానవాటికలో కర్మక్రియల భవననిర్మాణం అభివృద్ధి పనులకు గురువారం ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. సుమారు రూ.26 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్లు బి. చంద్రశేఖర్, చంద్రశేఖర్, శంకర్రెడ్డి, జన్మభూమి కమిటీ మెంబర్ నరసింహయాదవ్, దంపూరి భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.