క్యూఎస్ వరల్డ్ బ్రిక్స్ ర్యాంకింగ్స్లో ఎస్కేయూకు స్థానం
Published Saturday, 23 July 2016అనంతపురం సిటీ, జూలై 22:క్యూఎస్ వరల్డ్ బ్రిక్స్ ర్యాంకింగ్స్ తాజాగా ప్రకటించిన రాంకింగ్స్లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి స్థానం లభించింది. ఎస్కేయూ ఉపకులపతి ఆచార్య కె.రాజగోపాల్ చేసిన మార్గనిర్థేశనంలో ఎస్కేయూకు ఈ గౌరవం దక్కింది. క్యూయస్ వరల్డ్ బ్రిక్స్ ర్యాంకింగ్స్ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో ఎస్కేయూ చరిత్రలో మొట్టమొదటి సారిగా ఉపకులపతి ఆచార్య రాజగోపాల్ నేతృత్వంలో ఎస్కేయూకు స్థానం లభించడం విశేషం. దేశంలో 421 విశ్వవిద్యాలయాలు క్యూఎస్ వరల్డ్ బ్రిక్స్ ర్యాంకింగ్స్లో స్థానం కోసం దరఖాస్తు చేయగా 44 విశ్వవిద్యాలయాలకు చోటు లభించింది. క్యూఎస్ వరల్డ్ బ్రిక్స్ ర్యాంకింగ్స్లో ఎస్కేయూకు లభించడం పట్ల బోధన, బోధనేతర సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.