ప్రజలను మోసగించిన ఘనత బాబుకే దక్కుతుంది
Published Saturday, 23 July 2016పెనుమూరు, జూలై 22: రాష్ట్ర ప్రజలను మోసగించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి అభివృద్ధితో పాటు సంక్షేమ ఫలాల్లో తనదైన శైలిలో రాష్ట్రాన్ని దోచుకుంటున్న ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు. శుక్రవారం మండలంలోని చార్వగానిపల్లె పంచాయతీ పరిధి దాసరపల్లి, చార్వగానిపల్లి, పిఎస్ అగ్రహారం కాలనీ, అగ్రహారం ఊరు తదితర గ్రామాల్లో గడపగడపకు వైకాపా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు అధికారంలో ఉన్న ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, రెండు రాష్ట్రాలు విడిపోయేందుకు కారణం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తి పోసారు. అయితే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా తమదైన శైలిలో రాజధాని నిర్మాణంలో ప్రైవేటు కంపెనీలతో చేతులు కలిపి కోట్లు దండుకుంటున్నారని ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు. ఈకార్యక్రమలో వైకాపా మండల కన్వీనర్ సురేష్రెడ్డి, విజయకుమార్, దాము, హరికృష్ణ, మార్కొండారెడ్డి, కమలాకర్రెడ్డి, మనోహర్, బాబు, దొరస్వామిరెడ్డి, దూది మోహన్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.