S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాల ఆటో బోల్తా : ఏడుగురు విద్యార్థులకు గాయాలు

రామచంద్రాపురం, జూలై 22: కుప్పం బాదూరు సమీపంలో పాల ఆటో బోల్తా పడటంతో ఏడుగురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకెళితే పరమాల నుంచి గంగి రెడ్డిపల్లి వైష్ణవి డెయిరీఫామ్‌కు పాలు తరలిస్తున్న ఆటోలో పరమాల, మిట్టకండ్రిగ, కుప్పం గ్రామాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు కుప్పంబాదూరు పాఠశాలకు వెళ్లడానికి ఎక్కారు. కుప్పం బాదూరు రైస్‌మిల్ సమీపంలో మలుపువద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో10వ తరగతి చదువుతున్న రమేష్, చలపతికి, 9వ తరగతి చదువుతున్న శ్రీనివాస్, జయంత్‌కు, 7వ తరగతి చదువుతున్న మధుసూదన్‌కు, 8వ తరగతి చదువుతున్న సాగర్‌కు, అదేవిధంగా తిరుపతి కళాశాలలో చదువుతున్న ఫృధ్వీకి తీవ్ర రక్తగాయాలయ్యాయి. కుప్పం బాదూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యులు డాక్టర్ గౌరీశంకర్ వీరికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. ఎస్ ఐ సురేష్‌కుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోడ్రైవర్ పరారీలో ఉన్నాడు.