రైతులందరికీ పూర్తిస్థాయలో పరిహారం
Published Saturday, 23 July 2016గొల్లప్రోలు, జూలై 22: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా చేపట్టనున్న బైసాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులందరికీ పూర్తిస్థాయిలో నష్ట పరిహారం చెల్లిస్తామని అదనపు జాయింట్ కలెక్టర్ రాధాకృష్ణమూర్తి తెలిపారు. గొల్లప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం భూములు కోల్పోతున్న రైతులకు సంబంధించిన భూమి రికార్డులు, పాస్బుక్లను ఆయన పరిశీలించారు. జాతీయ రహదారి విస్తరణ మొదటి విడతకు సంబంధించి భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నామన్నారు. రికార్డులు పెండింగ్లో ఉన్న రైతులు, రీ సర్వేకు దరఖాస్తు చేసుకున్న రైతులకు కూడ త్వరలోనే పరిహారం చెల్లిస్తామని జెసి చెప్పారు. కార్యాలయ సిబ్బంది ఏసుబాబు, షరీప్, రాఘవేశ్వరరావు పాల్గొన్నారు.