బార్ అసోసియేషన్ను సందర్శించిన జిల్లా జడ్జి
Published Saturday, 23 July 2016నెల్లూరు లీగల్, జూలై 22: నూతనంగా నెల్లూరు జిల్లా జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన వౌలానా జునైద్ అహ్మద్ శుక్రవారం నెల్లూరు బార్ అసోసియేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయమూర్తులు, న్యాయవాదులు పరస్పర సహకారంతో కేసులు పరిష్కరించాలని అప్పుడే ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని అన్నారు. బార్ అసోసియేషన్లో న్యాయవాదులకు సంబంధించిన కూలర్ను ఆయన ప్రారంభించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు రామచంద్రారెడ్డి, జనరల్ సెక్రటరీ జి బాలసుబ్రహ్మణ్యం, పట్టణంలోని వివిధ కోర్టుల న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.