జపాన్ సంస్కృతిని, భాషను ప్రోత్సహిస్తాం
Published Saturday, 23 July 2016జగదాంబ, జూలై 22: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జపాన్ భాష, సంస్కృతిని మరింతగా ప్రోత్సహిస్తామని ఎయు విసి ప్రొఫెసర్ జి.నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం తన కార్యాలయంలో మాట్లాడుతూ మిత్సుబిషి కార్పొరేషన్ సంస్థ ఎయులో జపాన్ భాష అధ్యయన కేంద్రం అభివృద్ధికి రూ.15 లక్షల నిధులను మంజూరు చేసిందన్నారు. ఎయులో జపాన్ అధ్యయన కేంద్రం విస్తృతికి అందిస్తున్న సహకారం అభిలషణీయమన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యయన కేంద్రం డైరెక్టర్ డివిఆర్ మూర్తి ఉన్నారు.