డిజిపి రాముడుకు ఆత్మీయ వీడ్కోలు
Published Saturday, 23 July 2016విజయవాడ: ఎపి డిజిపి జెవి రాముడు శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఇక్కడి పరేడ్ గ్రౌండ్స్లో పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రకు తొలి డిజిపిగా గత రెండున్నరేళ్ల కాలంలో రాముడు విశేష సేవలందించారని పలువురు పోలీసు అధికారులు గుర్తు చేశారు. నూతన డిజిపిగా ఆర్టీసీ ఎండి నండూరి సాంబశివరావు బాధ్యతలు చేపట్టారు.