టెక్నాలజీ సాయంతో నేరాలకు అడ్డుకట్ట
Published Saturday, 23 July 2016విజయవాడ: ఆధునిక టెక్నాలజీ సాయంతో నేరాలను నియంత్రించి శాంతి భద్రతలను కాపాడతామని ఎపి డిజిపిగా బాధ్యతలు చేపట్టిన నండూరి సాంబశివరావు శనివారం తెలిపారు. పదవీ విరమణ చేస్తున్న డిజిపి జెవి రాముడు నుంచి ఆయన బాధ్యతలు చేపట్టారు. తనను డిజిపిగా ఎంపిక చేసినందుకు సిఎం చంద్రబాబుకు నండూరి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖలో నిత్యం ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్రానికి సేవలందిస్తానని ఆయన చెప్పారు.