మ్యూనిక్ ఘటన మృతుల్లో భారతీయులు లేరు
Published Saturday, 23 July 2016దిల్లీ: జర్మనీలోని మ్యూనిక్ నగరం మాల్లో కాల్పుల ఘటన మృతుల్లో భారతీయులెవరూ లేరని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. ఓ మాల్లోని రెస్టారెంట్లో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాల్పులకు పాల్పడిన 18ఏళ్ల దుండగుడు కూడా తర్వాత తనను తాను కాల్చుకుని మృతిచెందాడు.