వాహనాల మధ్య ఇరుక్కుని తల్లి,కుమార్తె మృతి
Published Saturday, 23 July 2016విశాఖ: నగరంలోని ఎండాడ వద్ద జాతీయ రహదారిపై శనివారం ఆర్టీసీ, బస్సు, జీపు ఢీకొన్న సంఘటన తల్లి, కుమార్తెలను బలితీసుకుంది. ఈ వాహనాల మధ్య తల్లీకూతుళ్లు వెళుతున్న బైక్ నుజ్జునుజ్జయ్యింది. దీంతో ఆ ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.