అప్పుడు నాటిన మొక్కలు ఎక్కడ..?
Published Saturday, 23 July 2016మెదక్: గత ఏడాది నాటిన మొక్కలు ఎక్కడ ఉన్నాయంటూ మంత్రి హరీష్రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్కల్ మండలం సింగూరు జలాశయం ఇన్టేక్ వెల్ పనులను ఆయన శనివారం పరిశీలించారు. పంప్హౌస్ వద్ద మొక్కలు నాటారు. గత ఏడాది ఇక్కడ నాటిన మొక్కలు ఏమై పోయాయని ఆయన ప్రశ్నించగా అధికారులు నీళ్లు నమిలారు. అధికారుల తీరు సరిగా లేదని మంత్రి ఆగ్రహం ప్రకటించారు. నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.