ఆగస్టు 25న మాల్యా కార్లు వేలం!
Published Saturday, 23 July 2016ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా కి చెందిన 8 కార్లను వేలం వేయడానికి సిద్ధమైంది. మాల్యా, ఆయన కంపెనీకి చెందిన కార్లను వేలం వేస్తున్నట్లు ఎస్బీఐ కాప్ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ ప్రకటించింది. ఇటీవల మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ హౌస్, ఇతర ఆస్తులు వేలం వేయగా కొనడానికి ఒక్కరు కూడా ముందుకు రాని సంగతి తెలిసిందే. బ్యాంకులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయలు చెల్లించకుండా ప్రస్తుతం లండన్లో మాల్యా ఉంటున్న సంగతి తెలిసిందే. కార్ల వేలానికి దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 23న ముగుస్తుందని ఎస్బీఐ తెలిపింది.