బోరుబావిలో పడి బాలుడి మృతి
Published Saturday, 23 July 2016జబల్పూర్: మధ్యప్రదేశ్లోని కెహ్రి గ్రామంలో శుక్రవారం బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడు మరణించాడు. బాలుడిని రక్షించేందుకు బిఎస్ఎఫ్ సిబ్బంది బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వి సుమారు 15 గంటల సేపు శ్రమించారు. శనివారం మధ్యాహ్నం బాలుడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. రాత్రంతా విద్యుత్ లైట్ల వెలుగులో సిసి కెమెరాలను ఉపయోగించి బాలుడిని ప్రాణాలతో రక్షించేందుకు సైనికులు శ్రమించినా చివరకు ఫలితం దక్కలేదు. బాలుడి పక్కనే ఓ పాము కనిపించినట్లు అధికారులు తెలిపారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు, బంధువులు శోకసముద్రంలో మునిగారు.