S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తిరుపతి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

అనంతపురం: ముదిగుబ్బ మండలం సంకేపల్లి వద్ద శుక్రవారం రాత్రి రెండు గంటల సమయంలో జీపును ఓ లారీ ఢీకొనడంతో అయిదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఆరుగురిని ఆస్పత్రిలో చేర్పించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కర్నాటకలోని నళమంగళకు చెందిన 11 మంది తిరుమల వెళ్లేందుకు జీపులో బయలుదేరారు. ముంబయి-చెన్నై రహదారిపై వీరు ప్రయాణిస్తున్న జీపును టమాటాల లోడుతో వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో జీపు నుజ్జునుజ్జయ్యింది. మృతుల్లో జీపు డ్రైవర్, ఓ బాలిక ఉన్నారు.