పరువు పేరుతో ప్రేమజంట హత్య
Published Saturday, 23 July 2016ముజఫర్నగర్ (ఉత్తరప్రదేశ్ ) : ముజఫర్నగర్లో చందెలమల్ గ్రామంలో టీనేజి బాలిక ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉండటం చూసి ఆగ్రహంతో కుటుంబ సభ్యులు ఆ ఇద్దరినీ గొంతునులిమి చంపేశారు. బాలిక తండ్రి ముఖేష్, సోదరుడు దీపక్లను పోలీసులు విచారించగా కుటుంబం పరువు తీసినందుకు తామే వారిని చంపినట్లు నిందితులు అంగీకరించారు. తండ్రి ముఖేష్, సోదరుడు దీపక్లను అరెస్టుచేసి, గ్రామంలో భద్రత కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు.