కార్మికులు బాగుండాలి: చంద్రబాబు
Published Saturday, 23 July 2016విశాఖ: సీఎం చంద్రబాబు శనివారం బ్రాండెక్స్ కార్మికులతో సమావేశాన్ని నిర్వహించారు. పరిశ్రమలు అభివృద్ధి చెందాలని, కార్మికులు బాగుండాలని చెప్పారు. బ్రాండెక్స్ కార్మికులకు రూ.1000 పెంచేందుకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. జీతాల పెంపుపై కమిటీ వేశామని, కమిటీ సూచన మేరకు జీతాల పెంచుతామని ఆయన పేర్కొన్నారు.