ఆగస్ట్15న లాల్చౌక్లో భారత జెండా ఎగరేస్తా...
Published Saturday, 23 July 2016లూధియానా: జమ్ముకాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లాల్చౌక్లో ఆగస్ట్15న భారత జెండాను ఎగరేస్తానని, దమ్ముంటే ఆపమని పంజాబ్ లూధియానాకు చెందిన 15 ఏళ్ల విద్యార్ధిని ఝాన్వీ బెహల్ సవాల్ విసిరారు. జమ్ముకాశ్మీర్ వాసుల్లో కొందరు కావాలనే భారత జెండాను అవమానిస్తూ, పాక్ జెండాలను ఎగురవేస్తున్నారని, వారికి బుద్ధి చెప్పేందుకే తాను లాల్చౌక్లో తిరంగా ఎగురవేయాలనుకుంటున్నానని చెప్పారు. లాల్చౌక్లో నిరంతరం భారతజెండాకు అవమానం జరుగుతోందని, అందుకే అక్కడ ఎగరేయాలనుకుంటున్నానని ఝాన్వీ చెప్పారు. ఝాన్వీ గతంలో ఢిల్లీ జెఎన్యూ విద్యార్ధి కన్నయ్యకు కూడా సవాల్ విసిరారు.